మెదక్ మున్సిపాలిటీ, జనవరి 11: ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్లో జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు, వెకేంట్ల్యాండ్స్, ఏంక్రోచ్మెంట్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ప న్నులు, గ్రంథాలయ సెస్, హరితహారం, పట్టణ సుందరీకరణ, పార్కుల ఏర్పాటు, వైకుంఠధామలు, వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాల ప్రగతి, పారిశుధ్యం, చెత్త సేకరణ తదితర అంశాలపై కమిషనర్లతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిమాండ్ మేరకు ప న్నుల వసూళ్లు ఆశాజనకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశా రు. బిల్ కలెక్టర్ల పర్యవేక్షణలో బృందాల వారిగా క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యం మేరకు అసెస్మెంట్ చేసి పన్ను లు రాబట్టాలని సూచించారు. ప్రతి రోజు విధిగా మానిటరింగ్ చేస్తూ వివరాలను ఎప్పటికప్పుడూ సీడీఎంఏ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ సం స్థలు కార్యాలయాల నుంచి ఎంత మేరకు పన్నులు చెల్లించాల్సి ఉంది, నోటీసులు ఇచ్చారా.. వారి నుంచి స్పందన ఎలా ఉందో వెంటనే వివరాలు అందజేయాలని ఆదేశించారు.
మార్గదర్శకాల మేర కు ఇంటి నిర్మాణాల అనుమతులు ఇవ్వాలని, అక్ర మ నిర్మాణాలను గుర్తించి తొలగించాలని సూచించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను అక్రమించి డబ్బాలు నెలకోల్పిన వారి నుంచి పన్నులు వసూళ్లు చేయడంతో పాటు వారి పూర్తి వివరాలు అందజేయాలని కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు సర్వే చేసి నేటి వరకు ట్రేడ్ లైసెన్స్లు పొందని వారికి అవగాహన కల్పించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. లైసెన్స్ దారుల నుంచి ఎంత మేరకు ఫీజు వచ్చే అవకాశం ఉంది, ఎంత వస్తుందో కమిషనర్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గ్రంథాలయాలకు చెల్లించాల్సిన సెస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలకు అవసరం గల జేసీబీ, డోజర్ ట్రాక్టర్ వంటి వా హనాల కొనుగోలుకు కౌన్సిల్లో ప్రతిప్రాదనలు సమర్పించాలని ప్రతిమాసింగ్ సూచించారు. కమిషనర్లు కౌన్సిలర్ల వెంట వార్డుల్లో తిరిగి పారిశుధ్య పనులు పరిశీలించాలని, ఇంటింటా సేకరిస్తున్న తడి పొడి చెత్తను డంప్యార్డులకు తరలించాలని, జీవ వ్యర్థాలు డీగ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోవలన్నారు. ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణం, పార్కు ఏర్పాటు చేయడంతో పాటు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలన్నారు.
పట్టణాల సుందరీకరణలో భాగంగా వ్యూ పాయిం ట్ ఉండేలా కప్ సాసర్, లైటింగ్, వాటర్ఫాల్స్, చెరువులు, కాలువ కట్టల వద్ద పచ్చదనం, లైటింగ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టేలా చక్కటి ప్రణాళికతో డీపీఆర్లు రూపొందించాలని కమిషనర్లకు ఆదేశించారు. సివిల్ ఇంజినీరింగ్ పనులను సమీక్షిస్తూ వైకంఠధామాలు, వెజ్, నాన్వెజ్ మా ర్కెట్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువ నిర్మాణాలు, జంతు సంక్షేమ కేంద్రం నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. స్వచ్ఛభారత్ మరిన్ని అవార్డులు సాధించడానికి అన్ని విధాల కృషి చేస్తూ అట్టి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల ని ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు జానకిరామ్సాగర్, మోహన్, యాదగిరి, వెంకట్గోపాల్, మున్సిపల్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.