మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 22 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగుల వాడకంపై అంక్షలు ఉన్నప్పటికీ మెదక్ జిల్లా కేంద్రంలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ జానకీరాంసాగర్ ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సంద ర్భంగా దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల బ్యాగులు కుప్పలు కుప్పలుగా దొరికాయి. రోడ్ల పక్కన పండ్లు చిరు వ్యాపారుల వద్ద సైతం ప్లాస్టిక్ కవర్లు దొరికాయి. స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ కవర్లను డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్ జారిమానా విధించారు. ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లతోపాటు డిస్పోజల్ గ్లాసులను ప్రభుత్వ నిషేధించిందన్నారు.
ఫ్లాస్టిక్ కవర్లను అమ్మితే జరిమానా
నిషేధిత ప్ల్లాస్టిక్ కవర్లను అమ్మితే జరిమానా తప్పదని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి హెచ్చరించారు. నర్సాపూర్ మున్సిపల్లోని దుకాణాలను కాలుష్య నియంత్రణ మండలితో కలిసి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్ల్లాస్టిక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్డ్ ప్ల్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్న దుకాణాల యజమానులకు రూ.5వేల చొప్పన జరిమానా విధించారు. సింగిల్ యూజ్డ్ ప్ల్లాస్టిక్ కవర్లు విక్రయించొద్దని హెచ్చరించారు. తనిఖీల్లో ఎన్విరాన్మెంట్ ఇజినీర్ మధు, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి పాల్గొన్నారు.