స్లాబ్లు పూర్తి.. కొనసాగుతున్న గోడల నిర్మాణం
90వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో నిర్మాణం
జూన్ నాటికి పూర్తిచేసేలా లక్ష్యం
రూ.30 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి, ఫిబ్రవరి 25:జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా నిర్మాణ పనులకు గానూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు కేటాయించింది. 35 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో మెడికల్ కళాశాల భవనం 90 వేల చదరపు అడుగుల్లో, మూడు అంతస్తుల్లో రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే స్లాబ్లు పూర్తికాగా, గోడల నిర్మాణ పనులు కొసాగుతున్నాయి. జూన్ నాటికి అన్ని వసతులు ఏర్పాటుతో పాటు పనులు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు పనులు వేగిరం చేశారు. వచ్చే విద్యాసంవత్సరానికి నూతన భవనం అందుబాటులోకి రానుండడంతో వైద్య విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో రోగులకు మెరుగైన వైద్యం అందనున్నది.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో వైద్య కళాశాలకు తొలి అడుగులు పడుతున్నాయి. 90 వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో విశాలవంతమైన భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేలా యంత్రాం గం కృషిచేస్తున్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు భవనాలకు స్లాబ్ పూర్తిచేశారు. మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్అండ్బీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పనులు చేయిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పూర్తిచేసుకుని మొదటి, రెండో అంతస్తులకు స్లాబ్లు పూర్తి చేసి గోడల నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులకు ప్రభు త్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. దీంతో వైద్య విద్య కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు త్వర లో తీపికబురు అందనున్నది. వైద్య కళాశాల, దవాఖానలో విధులు నిర్వహించే నర్సుల కోసం ప్రత్యేకంగా కళాశాల, వసతి గృహానికి రూ.40 కోట్లను సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. వచ్చే జూన్ నాటికి ప్రథమ సంవత్సర మెడికల్ విద్యార్థుల బోధనకు గాను పూర్తిస్థాయి భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు.
మూడు అంతస్తుల్లో భవన నిర్మాణం..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలోని 35 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మూడు అంతస్తుల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు చదువుకోవడానికి, ల్యాబ్ పరీక్షలు నిర్వహించే విధంగా గదులను తీర్చిదిద్దనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో క్యాం టీన్, వివిధ రకాల రెండు ల్యాబ్స్, రీడింగ్ రూమ్స్, ఫ్యాకల్టీ గదులు ఏర్పాటు చేయనున్నారు. మొదటి అం తస్తులో ప్రథమ సంవత్సరం విద్యా బోధనను, అధ్యాపకులు, ఫ్యాకల్టీల గదులు ఉండనున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోడ్లు, భవనాల ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిర్మాణ పనులు చేస్తున్నారు. మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పటికప్పుడు పనులపై ఆరాతీస్తున్నారు.
నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేస్తాం
ప్రభుత్వం ఆదేశాల మేరకు మెడికల్ కళాశాల భవన నిర్మాణాన్ని జూన్ నాటికి పూర్తిచేసి ప్రథమ సంవత్సరం తరగతుల నిర్వహణకు అందజేస్తాం. ప్రస్తుతం గ్రౌండ్, మొదటి, రెండు అంతస్తుల భవనాలకు స్లాబ్లు వేశాం. గోడల నిర్మాణాలు కొనసాగుతున్నవి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖర్చు చేస్తూ అనుకున్న సమయానికి భవనం సిద్ధం చేస్తాం.
–సురేశ్, ఆర్అండ్బీ ఈఈ, సంగారెడ్డి