నర్సాపూర్, డిసెంబర్ 15 : నూతన ఆవిష్కరణలు ప్రజలకు ఉపయోగపడాలని టీ-హబ్ సీఈవో రాజేశ్ కుమార్ అన్నారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఐఐసీ, ఈడీసీ, టీహబ్ల సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ హబ్ సీఈవో రాజేశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడమే టీహబ్ ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించారు.
నూతన ఆవిష్కరణలు చేయడంతో ఎంతో మంది కొత్త వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. టీ హబ్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో గర్తింపు పొందిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, టీ హబ్ అసోసియేట్ చైతన్య శ్రవణ్, మేనేజర్ బాపిరాజు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.