సంగారెడ్డి జనవరి 18 (నమస్తే తెలంగాణ): నేడు ఐఐటీ హైదరాబాద్లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభంకానున్నది. కేంద్ర విద్యాశాఖ ఏటా నిర్వహించే మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ఈసారి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జరగనున్నది. శుక్ర, శనివారాల్లో ఇన్వెంటివ్-2024 పేరిట మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ నిర్వహించనున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శుక్రవారం ఆన్లైన్లో ఈ ఫెయిర్ను ప్రారంభించనున్నారు. ఈ ఫెయిర్లో 23 ఐఐటీలు, బెంగళూరులోని ఐఐసీ, ఐఐఐటీలు, ఎన్ఐటీలు పాల్గొననున్నాయి.
50కి పైగా సాంకేతిక విద్యాసంస్థలు 120 ఆవిష్కరణలు ప్రదర్శించనున్నాయి. వైద్యం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ, అంతరిక్షం, పరిశ్రమలు, సుస్థిరమైన టెక్నాలజీ అంశాల్లో 53 సాంకేతిక విద్యా సంస్థలు తమ 120 నూతన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. ఈ ఫెయిర్కు దేశంలోని 2000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ విద్యా సంస్థలు తమ కొత్త ఆవిష్కరణలను ఈ సెంటర్లో ప్రదర్శించనున్నాయి. ఈ ఫెయిర్ ప్రారంభించేందుకు ఐఐటీ హైదరాబాద్ గవర్నింగ్ బాడీ చైర్మన్ బీవీఆర్.మోహన్రెడ్డి, ఐఐటీ డైరక్టర్ బీఎస్ మూర్తి, సాంకేతిక విద్యాసంస్థల డీన్లు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు.