పాపన్నపేట, ఫిబ్రవరి 25: పవిత్ర పుణ్యక్షేతం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధికి ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూధన్ రెడ్డి, రవివీర్ కుమార్, రాజు, ప్రతాప్రెడ్డి, తోట నర్సింలు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్ అన్ని ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకర శర్మ, పార్థివ శర్మ, మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.