గుమ్మడిదల, అక్టోబర్ 3: బీఆర్ఎస్కు ప్రజలే బలం, బలగమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బ్రహ్మరథంపట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందించి గులాబీ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. స్వరాష్ట్రంలో నిధుల వరదతో అభివృద్ధి పరుగుల తీస్తూ మోడల్ గ్రామపంచాయతీలుగా మారుతున్నాయన్నారు. మంగళవారం గుమ్మడిదల మండలంలోని వీరారెడ్డిపల్లి, కానుకుంట, కొత్తపల్లి, మంభాపూర్, గుమ్మడిదల, బొంతపల్లి, వీరన్నగూడెం, దోమడుగు, అన్నారం గ్రామ పంచాయతీల పరిధిలో ఒక్కరోజే రూ.10.81 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి పలు గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికి, ర్యాలీగా తరలివెళ్లారు. అడుగడునాస్వాగతాలు, గజమాలతో, శాలువాలతో సన్మానాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవించిందన్నారు. నేడు ప్రతి పల్లె, మారుమూల గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన బీసీ బంధు, గృహలక్ష్మి పథకాల ద్వారా పేదలకు ఉపాధి, సొంతింటి కల సాకారమవుతుందన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు హాట్రిక్ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధితో మోడల్ నియోజకవర్గంగా, మోడల్ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయని తెలిపారు.
అభివృద్ధిని చూసి, సంక్షేమ ఫలాలను చూసి నియోజకవర్గ ప్రజలు మరోమారు పటాన్చెరు నియోజకవర్గంలో గులాబీజెండాను ఎగురవేయాలని కోరారు. తనకు హాట్రిక్ విజయన్ని అందించి అభివృద్ధికి దోహదపడాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాల పార్టీల మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. నమ్మితే గోసపడడమే కాకుండా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, వైస్ఎంపీపీ మంజుల వెంకటేశ్గౌడ్, జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏఈపీఆర్ మల్లేశ్, సర్పంచ్లు చిమ్ముల నర్సింహారెడ్డి, ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్, మేడిపల్లి మురళీ, మమతావేణు, కంజర్ల శ్రీనివాస్, సుంకురేణుక, దీపానరేందర్రెడ్డి, బేకునీలమ్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్దన్రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, సద్దివిజయభాస్కర్రెడ్డి, తిరుమలవాసు, నరేందర్రెడ్డి, సురేందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మహ్మద్హుస్సేన్, నాయకులు మొగులయ్య, మడపతి గణేశ్, చంద్రశేఖర్, సంగం శేఖర్గౌడ్, నరహరి, తూపాకుల రాజు, ఎంపీటీసీలు పార్వతమ్మ, లక్ష్మి, నాగేందర్గౌడ్, పద్మాకొండల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
రూ.10.81 కోట్లతో ప్రారంభించిన పనులు
ముందుగా వీరారెడ్డిపల్లిలో రూ.30 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లు, యూజీడీ పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం కానుకుంటలో రూ.49.70 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లు, యూజీడీ పనులు ప్రారంభించి, రూ.15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కొత్తపల్లిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన, రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమైఖ్య భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. మంభాపూర్లో రూ.73 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లు, రూ.13 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీహాల్ను ప్రారంభించారు. రూ.15 లక్షలతో ఆధునీకరించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గుమ్మడిదలలో రూ.40 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లును ప్రారంభించారు. రూ.15 లక్షలతో పూర్తి చేయనున్న సీసీ రోడ్డు, యూజీడీ పనులకు శంకుస్థాపన చేశారు.
బొంతపల్లిలో రూ.3 కోట్ల 87 లక్షలతో పూర్తిచేసిన నూతన పంచాయతీ భవనం, కుర్మసంఘం ఆత్మగౌరవ భవనం, బీసీ కమ్యూనిటీహాల్ను, అయ్యప్పగుడి వరకు సీసీ రోడ్డు, బతుకమ్మ ఘాట్, ఫార్మేషన్ రోడ్లు, సీసీ రోడ్లు, యూజీడీ పనులను, ఎస్సీ ఫంక్షన్హాల్ను ప్రారంభించారు. రూ.15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. వీరన్నగూడెంలో రూ.70 లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని, రూ.35 లక్షలతో పూర్తి చేసిన యూజీ డీ, సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ.15 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. దోమడుగులో రూ.84.50 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీహా ల్, యూజీడీ, సీసీ రోడ్లను ప్రారంభించారు. అన్నారంలో రూ. 2 కోట్ల 7 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లు, అసీర్ఖానాను ప్రారంభించారు.