రామచంద్రాపురం, జనవరి 4: ఇంజినీరింగ్లో మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీని పూర్తిచేసిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆలిండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస్రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని శ్రీచైతన్య బాలికల కళాశాలలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ‘ఉన్నత విద్యావకాశాలు’ అనే అంశంపై ‘లక్ష్యం-2024’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆలిండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాస్రావు, కేఎల్ యూనివర్సిటీ అజీజ్నగర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, శ్రీచైతన్య ఏజీఎం రవికుమార్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అడ్వైర్టెజ్మెంట్ జీఎం సురేందర్రావు, ఏజీఎం రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జె.శ్రీనివాస్రావు మాట్లాడు తూ.. ఇంటర్ పూర్తి చేయబోతున్న విద్యార్థులు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఏ,బీ,సీ మూడు ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. మొదట టాప్ 10 యూనివర్సిటీలను ఎంచుకోవాలన్నారు. ఆ తర్వాత టాప్ 5, ఆ తర్వాత టాప్ 3 వర్సిటీలను ఎంచుకుని కెరీర్ నిర్దేశించుకోవాలనన్నారు. ఇంజినీరింగ్లో సీఈసీతోనే మన లైఫ్ ఆధారపడి ఉండదని, సీఈసీలో సీటు దొరకని పక్షాన డ్యూయల్ కోర్సు చేసే అవకాశం ఉంటుందన్నారు. సెమిస్టర్స్లో 9 సీజీపీఏ గ్రేడ్ సాధించిన వారికి డ్యూయల్ కోర్సులో అవకాశం ఉంటుందని సూచించారు. కేఎల్ యూనివర్సిటీలో శ్రీచైతన్య విద్యార్థిని చేరిందని, ఆ విద్యార్థినికి సీఈసీ కోర్సు చేయాలని ఉందని, కానీ.. ఆమెకు ఆ సీటు దొరకలేదన్నారు.
అప్పుడు ఆ విద్యార్థికి నచ్చజెప్పి మెకానికల్లో సీటు కేటాయించినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం మెకానికల్ చేసి రెండో సంవత్సరం సీఈసీ తీసుకుందని తెలిపారు. ఒక సబ్జెక్టు మెకానికల్, మిగతావి సీఈసీ సబ్జెక్టుతో పూర్తి చేసిందన్నారు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఆమె కు మెకానికల్ పట్టా వచ్చినప్పటికీ, అందులో మెకానికల్, సీఈసీ రెండు కోర్సులకు సంబంధించిన డ్యూయల్ పట్టా ఉండడంతో ఆ విద్యార్థినికి కియా కంపెనీ ఇంటర్వ్యూలో మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు. జేఈఈ, నీట్, ఐఐటీల్లో సీటు రాని విద్యార్థులు అక్కడే ఆగిపోకుండా మిగతా ఆప్షన్స్ కోసం ప్రయత్నం చేయాలన్నారు. కేఎల్ యూనివర్సిటీలో శ్రీచైతన్య నుంచి వచ్చిన ఏడుగురు విద్యార్థులు ఒకే కంపెనీలో రూ.50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో మూడేండ్లు మాత్రమే ఇంజినీరింగ్ ఉంటుందని, మొదటి సంవత్సరం ఇంజినీరింగ్, రెండో సంవత్సరం డిపార్ట్మెంట్కు వెళ్తారని, మూడో సంవత్సరం జాబ్ చేస్తూ ఫైనల్ ఇయర్ పూర్తి చేస్తారన్నారు. 95 శాతం మార్క్స్ సాధించిన విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీలో ఉచిత సీటు ఇస్తున్నట్లు శ్రీనివాస్రావు తెలిపారు. ఉన్నత విద్య-మంచి కెరీర్ కోసం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ వారితో కలిసి కేఎల్ యూనివర్సిటీ ‘లక్ష్యం 2024’ను నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు. అనంతరం లక్కీడ్రా తీసి విద్యార్థినులు, శ్రీచైతన్య టాపర్స్కు ప్రముఖులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీచైతన్య కళాశాల డీన్ ఎంఎన్ఆర్, ప్రిన్సిపాల్ పద్మ, కేఎల్ వర్సిటీ ఆర్ఎం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీచైతన్య విద్యాసం స్థలు దేశంలోకెల్లా ఉత్త మంగా ఉన్నాయి. దేశీ య స్థాయిలో ర్యాంకులు సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నా యి. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ‘లక్ష్యం 2024’ను నిర్వహించడం మన అదృష్టం గా భావించాలి. విద్యార్థులు ఏదైనా సాధించాలనే పట్టుదలతో చదువుకోవాలి. శ్రీచైతన్య స్టూడెంట్ ఒకరికి 16 ఏండ్ల వయస్సులోనే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేంత షుగర్ వ్యాధి ఉంది. అయినా ఆ అమ్మాయి తన తండ్రి కోసం జేఈఈలో 3వేల ర్యాంక్ సాధించి టాపర్గా నిలిచింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చదవాలి.
కేఎల్ వర్సిటీలో విద్యార్థులు వారికి నచ్చినట్టు చదువుకునే వెసులుబాటు ఉంది. మా వర్సిటీలో మూడు కెరీర్ చాయిస్లు ఉన్నాయి. విద్యార్థులు చదువుకునే సమయంలోనే ైస్టెఫండ్ సాధించడం, ప్లేస్మెంట్ ద్వారా జాబ్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. సొంతంగా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, లేదా హార్వర్డ్, ఆక్స్ఫర్ లాంటి వర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే అవకాశాన్ని వర్సిటీ కల్పిస్తున్నది.100 శాతం ప్లేస్మెంట్లను విద్యార్థులకు కల్పిస్తున్నది.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ వారు నిర్వహించిన లక్ష్యం-2024 సెమినార్ ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. డాక్టర్ జేఎస్ఆర్, శ్రీచైతన్య ఏజీఎం సార్ రవికుమార్ చెప్పిన విషయాలు మాకు బాగా నచ్చాయి. ఇంటర్ పూర్తయిన తర్వాత పై చదువుల కోసం ఏవిధంగా ఆలోచన చేయాలనే అంశాలు మాకు బాగా అర్థమయ్యాయి. ఇప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా కెరీర్లో ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తాం.
ఇంటర్ తర్వాత ఏ కోర్సులో చేరితే బాగుంటుందనే నా సందేహాలకు ఈ సెమినార్ పరిష్కారం చూపించింది. మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీకి మంచి డిమాండ్ ఉంటుందని తెలిసింది. జేఈఈ, నీట్, ఐఐటీలే కాకుండా అందులో ర్యాంకులు రాకుంటే ఏమి చేయాలనే దానిపై స్పష్టత ఇచ్చారు కేఎల్ యూనివర్సిటీ వారు. బాగా చదువుకుని కెరీర్లో పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజీని సాధిస్తా.
ఈ సెమినార్తో భవిష్యత్పై ఒక హోప్ వచ్చింది. మా కాలేజీలో ఇలాంటి సెమినార్ నిర్వహించినందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే, కేఎల్ యూనివర్సిటీ వారికి థ్యాంక్స్. డ్యూయల్ డిగ్రీ గురించి డాక్టర్ జేఎస్ఆర్ సార్ చక్కగా వివరించారు. చాలా విషయాలు తెలిశాయి. ఇంటర్ పూర్తయిన తర్వాత ఏవిధమైన స్టెప్ తీసుకోవాలో తెలిసింది. కెరీర్లో రాణించగలనని సెమినార్ ధైర్యం ఇచ్చింది.
విద్యార్థినులు టీనేజ్లోనే వారి భవిష్యత్తు కోసం సరైన మార్గం ఎంచుకోవాలి. టీనేజ్లో మార్గం సక్రమంగా పడితే భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. ఇంటర్ పూర్తి చేసుకునే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సెమినార్ను నిర్వహిస్తున్నాం. విద్యార్థులు సెమినార్ ద్వారా అవగాహన పొంది భవిష్యత్తులో బంగారు బాటలు వేసుకోవాలి. ‘నమస్తే తెలంగాణ’ విద్యార్థుల కెరీర్ కోసం నిపుణ అనే ప్రత్యేక సంచికలో బోలెడు సమాచారాన్ని అందజేస్తున్నది.
విద్యార్థులు సెమినార్లను సద్వినియోగం చేసుకోవాలి. మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. నమస్తే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిపుణ సంచికను అందజేస్తున్నది. ఆ సంచికలో ఉద్యోగ వివరాలు, ఎడ్యుకేషన్ గైడెన్స్, పోటీపరీక్షల మెటీరియల్ను అందిస్తున్నది. మూడేండ్లుగా ‘లక్ష్యం’ పేరిట ఇంటర్ తర్వాత విద్యార్థులు ఎంచుకోవాల్సిన అవకాశాలను తెలియజేస్తున్నాం.