మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 10 : మెదక్ చర్చిలో ఆదివారం మట్టల పండుగను చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జీ ప్రేమ్సుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలి రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఉదయం 8.30 గంటలకు యేసు శిలువతో పాటు భక్తులు మట్టలతో భక్తి గీతాలను అలపిస్తూ చర్చి చుట్టూ ఊరేగించారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
యేసు ప్రభువు జెరూసలేం పట్టణంలో ప్రథమంగా ప్రవేశించినపుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల మట్టలతో(చెట్ల కోమ్మలతో) ఘన స్వాగతం పలుకుతారు. దీనినే క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారు. ఈ సంద్భంగా చర్చి బిషప్ రెవరెండ్ సాలోమాన్రాజ్ భక్తుల నుద్దేశించి దైవ సందేశం చేశారు. అంతకు ముందు సండే స్కూల్కు చెందిన చిన్నారులు వివిధ రూపాల్లో యేసుక్రిస్తు పుట్టుపూర్వత్తరాలు తెలిపే విధంగా సాంస్కతిక ప్రదర్శనలను నిర్వహించారు.