సంగారెడ్డి కలెక్టరేట్, మే 6: జాతీయ స్థాయిలో మెడికల్ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,811 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో 600 మంది , కరుణా హై స్కూల్లో 456 , సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కళాశాలలో 360, సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో 360, సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాలలో 360, పయనీర్స్ స్కూల్లో 288 , రిషీ స్కూల్లో 240, సెయింట్ పీటర్స్ స్కూల్లో 147 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.