నర్సాపూర్, ఫిబ్రవరి 3 : 317 జీవోతో ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదని, ఏదైనా చిన్నచిన్న ఇబ్బందులు జరిగితే, వాటిని పరిష్కరించే బాధ్య త టీఎన్జీవోల సంఘానిదని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని టీఎన్జీవో సమావేశ మందిరంలో యూనిట్ అధ్యక్షుడు శేషచారి అధ్యక్షతనలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి రాజ్కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరించి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా ఉద్యోగుల ఆకాంక్షలే టీఎన్జీవోస్ ద్యేయమని వెల్లడించారు. సీఎం కేసీఆర్ పరస్పర బదిలీలకు కూడా అవకాశమిచ్చారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, సీడీపీవో హేమాభార్గవి, ఎంపీడీవో శ్రీనివాస్తో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ కార్యదర్శి రాకేశ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.