రామాయంపేట, ఏప్రిల్ 7: రామాయంపేట జాతీయ రహదారి 44పై వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తున్న పీడీఎస్ బియ్యం లారీని పట్టుకున్నట్లు రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ లారీని తనిఖీ చేశామన్నారు.
ఈ లారీకి ఎలాంటి అనుమతులు లేవని, అందులో 300 క్వింటాళ్ల బియ్యాన్ని తీసుకెళ్తున్నారన్నారు. లారీని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. గుజరాత్ రాష్ర్టానికి చెందిన డ్రైవర్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.