చేగుంట, సెప్టెంబర్ 4 : నిరుపేదలకు సొంత ఇంటి జాగాలో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించనున్నదని, 70 ఏండ్లలో తీరని గోస ఏండ్లల్లో తీరిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దేశంలో ఎక్లేని విధంగా రూ.2016 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని సాయిబాలాజీ గార్డెన్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మంచి కట్ల శ్రీనివాస్తో కలిసి నూతనంగా మంజూరైన 1151 మందికి పింఛన్ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. నార్సింగిలో రెడ్డిసంఘం, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజచేశారు. అనంతరం రైతు వేదికలో406 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రూ.200ల పింఛన్ ఇచ్చిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రూ.2016 ఇస్తున్నారన్నారు. 57 ఏండ్లకే పింఛన్ ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పకుండా ఇస్తున్నామన్నారు.
గత ప్రభుత్వాలు 25 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నదన్నారు. ఏడాదికి రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. పేదలకు పది కిలోల బియ్యం, రూ.2016 పింఛన్ ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉచితాలు వద్దంటుందని, కేంద్రం రూ.400 గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200 పెంచిందన్నారు. కార్పొరేట్లకు మాత్రం రూ.లక్షలు పెంచిపెడుతున్నదని వారు మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో పేదింటి ఆడపిల్ల పెండ్లికి రూ.లక్షా16 అందిస్తున్నదన్నారు. ప్రభుత్వ దవాఖానలో కాన్పుకు వెళ్తే రూ.12 వేలు, కేసీఆర్ కిట్టు అందిస్తున్నామన్నారు. రైతులకు ఉచిత కరెంట్, రైతుబీమా, రెండు పంటలకు రూ.10వేల అందజేస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో నాచారం గుట్ట మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అశోక్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాబీ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు రాములు, తాటి కొండ సిద్ధు, చింతకాయల సత్తయ్య, శ్రీనివాస్, సిద్ధి రాములు, కుంట యాదగిరి, శ్రీకాంత్, పోచమ్మల భిక్షపతి, టీఆర్ఎప్ మండల అధ్యక్షుడు వెంగళరావు, బాబు, ఎంపీటీసీలు వెంకటలక్ష్మి, సత్యనారాయణ, ఆకుల సుజాత, ఎంపీడీవో ఆనంద్మేరీ, తహసీల్దార్లు లక్ష్మణ్ బాబు, సత్యనారాయణ, ఈవోలు రాణి, నరేశ్ పాల్గొన్నారు.