సంగారెడ్డి, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ఎస్ఐఆర్ ప్రక్రియతో సంగారెడ్డి జిల్లాలో 2,98,278 ఓట్లు తొలగిపోనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 14,57,436 మంది ఓటర్లు ఉన్నా రు. ఎన్నికల కమిషన్ గత జూన్ 25 నుంచి ఈనెల 10వ తేదీ వరకు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టింది.
4,57,436 మంది ఓటర్లకు 11,59,158 మంది (79.53%) ఓటర్ల ఎన్యుమరేషన్ దరఖాస్తుల స్వీకరణ, డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది. ఎస్ఐఆర్ ప్రకియ ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,36,579 మంది ఓటర్లకుగాను 2,08,225 మంది ఓటర్లు,అందోల్లో 2,55,084 మంది ఓటర్లకుగాను 2,22,581, జహీరాబాద్లో 2,82,398లో మంది ఓటర్లకు 2,31, 891 మంది తమ ఓట్లను నమోదు చేసుకున్నారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో 2,54,693 మంది ఓటర్లకు 2,04,681 మంది ఓటర్లు, పటాన్చెరు నియోజకవర్గంలో 4,28,682 మంది ఓటర్లకు 2,91,780 మంది ఓటర్లు తమ ఓటర్లను నమోదు చేసుకున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియతో 2,98,278 ఓట్లు తొలగిపోనున్నాయి. అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో 1,36,902 ఓట్లు తొలగనున్నాయి. అధికారుల సమాచారం మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో 2,98,278 మంది నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి రాలేదు. ఇందులో అత్యధికంగా 1,59,376 మంది ఓటర్లు జిల్లాకు చెందిన ఓటర్లు తమ నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అలాగే జాడలేని ఓటర్లు 54,135 మంది, నకిలీ ఓటర్లు 36530 మంది, మృతిచెందిన ఓటర్లు 40962 మంది ఉన్నారు. దీంతో వీరి ఓట్లు పూర్తిగా ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నాయి.
పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 1,3 6, 902, నారాయణఖేడ్లో 28,354, అందోల్లో 32,50 3, జహీరాబాద్లో 50,507, సంగారెడ్డిలో 50,0 12 మంది ఓటర్లు జిల్లా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోనున్నారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిలో అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో 82,918 మంది ఓటర్లు ఉన్నా రు. పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తరభారత దేశంలోని బీహార్, ఉత్తర్ప్రదేశ్, ఓరిస్సా తదితర రాష్ర్టాల నుంచి వలసవచ్చిన ఓటర్లు ఉంటారు.
అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు సైతం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నారు. ఎస్ఐఆర్ కారణంగా ఉత్తర భార తం, ఆంధ్ర నుంచి వచ్చిన వలస ఓటర్లు తమ సొంత ప్రాంతంలోనే ఎన్యుమరేషన్ చేయించుకోవటంతో పటాన్చెరు నియోజకవర్గం నుంచి శాశ్వతంగా వలసవెళ్లిన 82,918 మంది ఉన్నారు. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో 1,36,902 మంది ఓటర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నారు.
