హైదరాబాద్ : అధికారులు, ప్రజాప్రతినిధులు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీఓలు, డీపీఓలు, డీఎల్ పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు తదితర అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పల్లె ప్రగతి, పచ్చదనం-పరిశుభ్రత-పారిశుద్ధ్యం ఒక జీవన విధానం కావాలి. గ్రామాల్లో నిత్యం పారిశుద్ధ్యం కొనసాగాలని నర్సరీలను, నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. డంపింగ్ యార్డులు, పల్లె పకృతి వనాలు, వైకుంఠ ధామాలు అన్నీ ఉపయోగంలోకి తేవాలని ఆదేశించారు.
ప్రతి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలవాలి. అవార్డులు రావాలి. కరోనా విజృంభన నేపథ్యంలో మరింత అప్రమత్రంగా సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు, ఇతర అధికారులు పని చేయాలని మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతి అత్యంత విజయవంతమైన కార్యక్రమం అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, ప్రజాప్రతి ప్రతినిధులు పేరుపేరునా అభినందించారు. పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు. సానిటేషన్ యాప్ ని తప్పనిసరిగా వాడాలి. ఆ యాప్ ద్వారా ప్రతి రోజూ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య వివరాలను అందులో పొందుపరచాలన్నారు.
కరోనా విజృంభన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..