మెదక్ అర్బన్, సెప్టెంబర్ 9: రాజీ చేసుకోవడంతోనే ఇరువురికి న్యాయం చేకూరుతుందని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా న్యాయస్థానాల సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్పర్సన్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల సముదాయంలో మొత్తం 18,876 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 8 యాక్సిడెంట్ కేసుల్లో రూ.54,45,200 నష్టపరిహారం, ఇన్సూరెన్స్ డబ్బు చెల్లించారు. 28 పీఎల్సీ బ్యాంకు రికవరీ కేసుల్లో రూ.17,99,450 రికవరీ చేశారని తెలిపారు. 2 భార్యాభర్తల కేసులు పరిష్కరించారు. 5,554 క్రిమినల్ కేసులు, 9 సివిల్ కేసులు, 13275 పెట్టి కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి రీటాలాల్చంద్, స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ కల్పన, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సిద్దయ్య, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జెన్నారెడ్డి, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 9: కోర్టుల్లో కేసులు వేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్లు ఉపయోగపడుతాయని సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయమూర్తి సుదర్శన్ సూచించారు. శనివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ ప్రారంభించారు. లోక్ అదాలత్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హన్మంతరావు నిర్వహించారు. మోటారు వాహన ప్రమాదాల నిర్వాసితులకు పరిహారం చెక్కులను ప్రధాన న్యాయమూర్తి అందజేశారు. జిల్లాలో సంగారెడ్డి-7, జహీరాబాద్-2, జోగిపేట్-1, నారాయణఖేడ్-1 కోర్టుల్లో 11 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటుచేశారు. కక్షిదారులు తమ న్యాయవాదులను కలిసి రాజీతో కేసులు పరిష్కరించుకున్నారు.
న్యాయమూర్తి సుదర్శన్ మాట్లాడుతూ సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగకరమన్నారు. న్యాయవాదుల సలహాలు పాటించి న్యాయం పొందాలని సూచించారు. లోక్ అదాలత్లలో 11,727 కేసులు పరిష్కరించి, బాధితులకు రూ.5,72,90,009 పరిహారం అందించినట్లు తెలిపారు. ఇందులో మోటారు వాహన ప్రమాద నష్టపరిహారం కేసులు -41 సంబంధించిన పరిహారం రూ.4,28,60,000 బాధితులకు ఇప్పించామన్నారు. బ్యాంకు రికవరీ 108 కేసుల్లో రూ.1,34,15,590 వివిధ బ్యాంకులకు ఇప్పించామన్నారు. ప్రీ లిటిగేషన్ ఏపీటీఎస్-1363 కేసుల్లో రూ.10,14,500లు ఇప్పించి న్యాయం చేశామని తెలిపారు. 41 మోటారు వాహన పరిహారం కేసులు, 23 సివిల్, 10154 క్రిమినల్ కాంపౌండబుల్, 108 బ్యాంక్ రికవరీ, 11 విద్యుత్ చౌర్యం, 07 ప్రీ లిటిగేషన్, 1383 ఏపీటీఎస్ కేసులు మొత్తం 11727 కేసులు రాజీ చేసినట్లు తెలిపారు. జాతీయ లోక్ ఆదాలత్లో జిల్లా అదనపు సెషన్స్ జడ్జి కృష్ణార్జున, నాల్గో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి లావణ్య, సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణా చౌహాన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి ఎస్.షాలినీ శాకెల్లి, ద్వితీయ శ్రేణి జేఎఫ్సీఎం కమ్ మొబైల్ కోర్టు జడ్జి అనిత, తృతీయ శ్రేణి అదనపు జేఎఫ్సీఎం కమ్ ఎక్సైజ్ కోర్టు జడ్జి పట్లోళ్ల తేజర్షి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, న్యాయవాదులు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్, సెప్టెంబర్ 9: జాతీయ లోక్ అదాలత్లో 1453 కేసులు పరిష్కరించినట్లు జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కే.సూరికృష్ట తెలిపారు. శనివారం జహీరాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 1 సివిల్, 58 బ్యాంకు కేసుల్లో రూ.1,56,15, 000 ఒప్పందం చేశారు. బ్యాం కు పీఎల్పీల నుంచి రూ.87,56,226 వసూలయ్యాయి. జూనియర్ కోర్టు లో 3 సివిల్ కేసులు, 75 క్రిమినల్ కేసులు, 1299 అడ్మిషన్ కేసులు, 17 ఎక్సైజ్ కేసులు పరిష్కరించి రూ.72,400 వసూలు చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.