మెదక్, జూలై 15 : పట్టణ ప్రగతి పనులు అమలుపర్చడంలో అన్ని మున్సిపాలిటీలు వెనుకంజలో ఉన్నాయని, పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్.హరీశ్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అన్ని మున్సిపాలిటీలో అమలవుతున్న పరిశుభ్రత, హరితహారం, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్షెడ్ తదితర అంశాల్లో వారం వారం ప్రగతిని సమీక్షించి ర్యాంకులు ఇస్తారని, మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు వెనుకబడ్డాయని, కమిషనర్లు ప్రత్యేక చొరవ తీసుకొని పనులను వేగవంతం చేయాలని అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీవోలను ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన బృందాలు అక్రమ లేఅవుట్లను, నిర్మాణాలను గుర్తించి తొలిగించాలని తాను అదనపు కలెక్టర్లు, ట్రైనీ కలెక్టర్లు పరిశీలిస్తామని అన్నారు. టీఎస్ ఐ పాస్ కింద ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయి.. ఎన్ని ఆమో దం తెలిపారు, ఆటోమాటిక్ పర్మిషన్ ఎన్ని ఇచ్చారు.. సెల్స్ అసెస్మెంట్ ఎన్ని చేశారు.. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు.
పది రోజుల్లో పనులు పూర్తి చేయాలి..
పల్లె ప్రగతి పనుల్లో 129 గ్రామ పంచాయతీలు వెనుకంజలో ఉన్నాయని, ఎంపీడీవో లు, ఎంపీవోలు ప్రత్యేక దృష్టి పెట్టి ఎందులో వెనుకంజలో ఉన్నారో గుర్తించి రాబోయే పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. మండలాల్లో తహసీల్దార్లు, పోలీసు, ఇంజినీర్లతో ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేస్తున్నామని, అన్ని గ్రామ పంచాయతీలలో లే అవుట్లను డీటీసీపీ లేదా హెచ్ఎండీవో ఆమోదం ఉందో లేదో పరిశీలించాలని, అక్రమమైతే తొలిగించాలన్నారు. అన్ని మండల కేంద్రంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణిలో డిజిటల్ సంతకం ఉన్నా, పాస్బుక్ వచ్చినా సక్రమంగా ఉందని అనుకోవాలని, అనుమానాలుంటే అదనపు కలెక్టర్ను సంప్రదించాలని, కానీ రిజిస్ర్టేషన్లు ఆపరాదని దీనిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని సూచించారు.వారసత్వ బదలాయింపునకు సంబంధించి స్థానికంగా విచారించి వాస్తవాలను నివేదికలో పొందుపరిచి కలెక్టర్ లాగిన్కు పంపాలని అన్నారు. కచ్చితంగా స్లాట్ బుక్ చేసుకున్న రోజే రిజిస్ట్రేషన్ జరుగాలని సూచించారు.ప్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్మెన్కు సంబం ధించిన ఎన్వోసీలను పరిశీలించి ప్రతిపాదించడమో, తిరస్కరించడమో చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.రమేశ్, ప్రతిమాసింగ్, ట్రైనీ కలెక్టర్ అశ్వి ని, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దా ర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.