మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 26: రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో ప్రాక్టికల్స్ పూర్తి చేశారు. పర్యావరణ విద్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. ఈనెల 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.
జిల్లాలో 58 కళాశాలల్లో 16 ప్రభుత్వ కళాశాలలు, 18 ప్రైవేటు కళాశాలున్నాయి. మిగతావి కస్తుర్బా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 13, 175 మంది విద్యార్థులు (ఒకేషనల్ విద్యార్థులతో కలిపి) పరీక్షలు రాయనున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,507 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,668 మంది ఉన్నారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు గల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ సెక్టైర్లెనా మోడల్ పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన గురుకుల పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్తోపాటు డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారు. ఈ పరీక్షలకు సుమారు 700 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రశ్న పత్రాలను పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందుగా సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేక అధికారులు విడుదల చేయనున్నారు. ఒక ప్లయింగ్ స్కాడ్ బృం దం (జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్సై), నాలుగు సిట్టింగ్ స్కాడ్ బృం దాలు, 5 కస్టోడియన్ టీమ్లను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపధ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనున్నది. ప రీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని పోలీస్ శాఖ ఆదేశించింది.
పరీక్షల నిమిత్తం కలెక్టర్ చైర్మన్గా హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్పీ, ఇంటర్మీడియట్ రీజియన్ డైరెక్టర్, ఇంటర్ నోడల్ జిల్లా అధికారి సభ్యులుగా ఉంటారు.
పరీక్షలు ఈనెల 28న ప్రారంభమై మార్చి 19న ముగుస్తాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9 గంటలు దాటితే అనుమతించరు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి. హాల్టికెట్లను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశాం. పరీక్షా కేం ద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. సమయం దాటితే అనుమతించరు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.