సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 3: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో 118 పరీక్షా కేంద్రాల్లో 21,385 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 21,351 మంది విద్యార్థులు, 99.84 శాతం హాజరయ్యారు. ఇందులో 21,340 మంది రెగ్యులర్, 11 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాశారు. కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డిలోని కరుణా స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ మున్సిన్సిపాలిటీ/కొల్చారం, ఏప్రిల్ 3: మెదక్ జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో తొలి రోజు ప్రథమ భాష పరీక్షకు 10,700 మందికి 10,671 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో రాధాకిషన్ తెలిపారు. ప్రైవేట్ విద్యార్థులు ఆరుగురిలో ముగ్గురు హాజరయ్యారు. కొల్చారం మండల కేంద్రంలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సోమవారం ప్రథమ భాష పరీక్షకు 10,700 మందికి 10,674 మంది రెగ్యులర్, ఆరుగురికి ముగ్గురు ప్రైవేట్ విద్యార్థులు (99.7 శాతం) హాజరయ్యారన్నారు.
అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. విద్యార్థుల హాజరు శాతంతో పాటు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఈవో రాధాకిషన్, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఎంపీవో కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఉపాధ్యాయులు ఎజాజ్ సుల్తానా, వెంకటరాజు తదితరులున్నారు. నర్సాపూర్లోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, మెదక్లోని పరీక్షా కేంద్రాన్ని ఆర్డీవో సాయిరాం సందర్శించారు. మెదక్, నర్సాపూర్లోని 13 పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సందర్శించారు.