చేగుంట,జూలై 20: రైతులు ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్ అన్నారు. చేగుంట మండల పరిధిలోని మక్కరాజిపేట రైతువేదికలో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొని వానకాలం పంటలపై అవగాన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్ మాట్లాడుతూ డ్రమ్సీడ్, పంటలసాగు, కలుపు నివారణ, సరియైన మోతాదులో ఎరువుల వాడకం పై పలు సూచనలు చేశా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి జయశంకర్, ఏఏవో మాధవి, రైతు బం ధు జిల్లా డైరెక్టర్ మోహన్రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, పాల్గొన్నారు.
కొల్చారంలో…
కొల్చారం, జూలై 20: మండల పరిధిలోని పైతరలో కౌడిపల్లి ఏడీఏ బాబునాయక్ రైతులతో సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా వానకాలం సాగులో తీసుకోవాల్సిన సూచనలు చేశారు. వరి లో వెదసాగు, సీడ్స్ ఫెర్టిలైజర్ ఉపయోగం, వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.కార్యక్రమంలో సర్ప ంచ్ వెల్మకన్నె సంతోష, ఎంపీటీసీ ఎల్లయ్య, మాజీ సర్పంచ్ భాను ప్రకాశ్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ దేవయ్య, ఏఈవో భార్గవ్, రైతులు పాల్గొన్నారు.
నర్సాపూర్లో
నర్సాపూర్,జూలై 20:వ్యవసాయాధికారుల సూచనలను, సలహాలను రైతులు పాటించాలని ఏవో వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని ఆయా రైతు వేదికల్లో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు వ్యవసాయాధికారుల సూచనలను పా టిస్తూ లాభసాటి వ్యవసాయం చేయాలని సూచించారు. పంట నమో దు కార్యక్రమంలో భాగంగా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
తూప్రాన్ రూరల్, జూలై 20 : వ్యవసాయంలో నూతన పద్ధతులను పాటించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించి ప్రయోజనాలను పొందాలని తూప్రాన్ మండల ఏఈవో సింధూ రైతులకు సూచించారు.మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో వ్యవసాయ పద్ధతులపై ఆమె రైతులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలతారాజిరెడ్డి, రైతు బంధు గ్రామ అధ్యక్షుడు మన్నె కృష్ణ పాల్గొన్నారు.