మెదక్ రూరల్ అక్టోబర్ 25: వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖీ కేం ద్రాలు బాసటగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. తప్పిపోయి మెదక్ సఖీ కేంద్రానికి షెల్టర్ కోసం వచ్చిన కేదారమ్మను ఆంధ్రపదేశ్లోని చిత్తూరుకు ప్రత్యేక వాహనంలో సోమవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పంపిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్7న తప్పిపోయిన కేదారమ్మను రామాయంపేట పోలీసులు సఖీ కేంద్రానికి అప్పగించగా ఆమె వివరాలు సేకరించామన్నారు. కేదారమ్మ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందింది. తల్లిదండ్రులు వృద్ధ్యాపంలో ఉండి రాలేని పరిస్థితుల్లో అమె స్వగ్రామానికి పంపుతున్నామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు.ఎవరికైనా అపద వస్తే 045 2-295181లేదా టోల్ ఫ్రీ నెంబర్ 181934 6 580 పోన్ నెంబర్లుకు సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సఖీ కేంద్రం నిర్వహకురాలు శాంత లీగల్ కౌన్సిల్ రాజిమున్నీసాబేగం , సోషల్ కౌన్సిలర్ భాగ్యలక్ష్మి,మార్గవి ఉన్నారు.
చిన్నారుల ఆరోగ్యంతోనే మెరుగైన సమాజం
చిన్నారుల ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సమాజాన్ని నిర్మించిన వారమవుతామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సెప్టెంబర్లో జరిగిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో చిన్నారుల్లో ఎదుగల ,బరువు తక్కువ ఉండడం గు ర్తించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. అందులో భాగం గా సోమవారం చిన్నశంకరంపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు . ఈ సందర్భంగా మా ట్లాడు తూ ఈ నెల 21 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. ప్రతిమాసం పిల్లల బరువు ,ఎదుగుదలను తీస్తూ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. చిన్నారులను పౌష్టికాహారం అందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రామయంపేట సీడీపీవో అంగ న్వాడీ టీచర్లు ఉన్నారు.
బృహత్ పల్లె పకృతి వనాలను అభివృద్ధి చేయాలి
బృహత్పల్లె ప్రకృతి వనాల అభివృద్ధికి కృషి చేయాలని అదనపపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశంగారిలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శులు జగదీశ్, వెంకటనర్సింహారెడ్డి, రెవెన్యూఅధికారి కిషన్, గ్రామనాయకుడు వెంకటేశంగారి సిద్ధ్దిరాములు, ఉపాధిహామీ టీఏ ఉన్నారు.