మెదక్, అక్టోబర్ 25 : టీఆర్ఎస్ 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో సోమవారం ప్లీనరీ నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు మెదక్ మున్సిపాలిటీలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివెళ్లారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకు లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వెళ్లిన వారిలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీటీసీ సుజాతశ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ యమునజయరాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మండల అధ్యక్షుడు అంజాగౌడ్, నాయకులు కిష్టయ్య, సాంబశివరావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
నవంబర్ 15న సభను విజయవంతం చేయాలి
టీఆర్ఎస్ ఏర్పడి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్లో నిర్వహించే విజయగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి కోరారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 15న నిర్వహించనున్న విజయగర్జనకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లాలన్నారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దుర్గారెడ్డి, నా యకులు రమేశ్ , సత్యనారాయణ, కిష్టయ్య, శ్రీనివాస్ రెడ్డి, సాయిప్రసాద్, చిరంజీవి, అనిల్, గోపాల్రెడ్డి, రజినీకాంత్ పాల్గొన్నారు.
చేగుంటలో..
హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ కి చేగుంట, నార్సింగి మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు తరలి వెళ్లారు.సమావేశానికి తరలిన వారిలో చేగుంట, నార్సింగి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంగళ్రావు, కుమ్మరి బాబు, ఎంపీపీలు శ్రీనివాస్, సబి త, జడ్పీటీసీలు శ్రీనివాస్, బాణపురం కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ప్రవీణ్కుమార్, వైస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొం డల్రెడ్డి, వైస్ చైర్మన్ పట్నం తానీషా, రైతు బంధు మం డల అధ్యక్షులు శ్రీనివాస్, లింగారెడ్డి, రాజేశ్, యాదగిరి, సోమ సత్య నారాయణ తదితులున్నారు.