మనోహరాబాద్, జూలై 25 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వ పెద్దపీట వేస్తున్నదని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లో మహిళలతో కలిసి ఆమె బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండుగను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. మన సంస్కృతి, పండుగలు నేడు దేశ, విదేశాల ప్రజలు ఆదరిస్తున్నారంటే అది సీఎం కేసీఆర్ కృషి అన్నారు. ఏటా బోనాల పండుగను వైభవంగా నిర్వహించే విధంగా సీఎం కేసీఆర్ చొరవ చూపుతున్నారని తెలిపారు. వేడుకల్లో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ర్యాకల కృష్ణాగౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ భిక్షపతి, నాయకులు నరేందర్, రమేశ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ముప్పిరెడ్డిపల్లిలో..
మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామస్తులు బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. అమ్మవారి దేవాలయం వద్ద ఒగ్గు కళాకారులు వేషధారణతో అమ్మవారి నాటకాన్ని ప్రదర్శించారు. వేడుకల్లో సర్పంచ్ ప్రభావతి పెంటయ్య, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సింగపూర్లో ఆషాఢమాసం ఉత్సవాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ప్రధాన కార్యదర్శి బసికె ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం ఉత్సవాలు జరుపుకొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్రెడ్డి సింగపూర్లో స్థిరపడ్డాడు. ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం సింగపూర్లోని ఓ అమ్మవారి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నట్టు తెలిపారు.