బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుమెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 2 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బడ్జెట్ పత్రాలను దగ్ధ్దం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భం గా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి గత బడ్జెట్ కంటే ఇప్పుడు 60 శాతం నిధులు తగ్గించడం దారుణమన్నారు. తక్కువ బడ్జెట్ కేటాయిస్తూ ఉపాధిహామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్వం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. సబ్సిడీలు ఎత్తేస్తూ అభివృద్ధి నిరోధక బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక వృద్ధ్దిరేటు కేవలం 6.0 ఉండడం దారుణమన్నారు. సంక్షేమ పథకాలక కేటాయించాల్సిన నిధులను తగ్గిస్తూ సంపన్నులకు కొమ్ముకాస్తుందన్నారు. నిధులను పెంచి ఆహార భద్రత పథకాన్ని రేషన్ దుకాణాల్లో అమలు చేస్తూ 16 రకా ల సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపా ధి హామీ కూలీలకు రూ.600 కూలీ చెల్లిస్తూ 200 రోజుల పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లక్ష్మాగౌడ్, వెంకట్, నిరంజన్దాస్, శాంత, జ్యోతి పాల్గొన్నారు.
కేంద్ర ఫ్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యారంగ అవసరాలను విస్మరించిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత బడ్జెట్లో విద్యారంగానికి 2.64శాతం నిధులు కేటాయిస్తే ఈ బడ్జెట్ అంచనాలో 2.50 శాతానికి తగ్గిందన్నారు. విద్యకు జీడీపీలో 3శాతం నిధులకు కూడా హామీ ఇవ్వలేదన్నారు. తెలంగాణలోని కేంద్ర విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేసిందని, ఐఐటీ విద్యాసంస్థల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించలేదన్నారు. గిరిజన యూనివర్శిటీ కోసం నామమాత్రంగా రూ.39 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. తెలంగాణలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.