పెద్దశంకరంపేట, డిసెంబర్ 24 : అన్ని మతాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక రైతు వేదికలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం మంజూరు చేసిన గిఫ్ట్ట్ ప్యాకెట్లను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత పాలకులు క్రైస్తవుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల పర్వదినాలకు ప్రజలకు కానుకలను అందజేస్తున్నదన్నారు.
గొట్టిముక్కులలో చర్చి, ఈద్గా పనులకు శంకుస్థాపనలు
గొట్టిముక్కుల గ్రామంలో చర్చి, ఈద్గా పనులకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇస్కపాయల తండాలో సీసీ రోడ్డు పనులను ప్రారం భించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బోండ్ల దత్తు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్గౌడ్, ఎంపీటీసీ వీణాసుభాశ్గౌడ్, నాయకులు వేణుగోపాల్గౌడ్, పున్నయ్య, సుభాశ్, సూర్యప్రకాశ్, సర్పంచ్లు పాల్గొన్నారు.
రైతుబీమా చెక్కు అందజేత
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట మండలంలోని ఉత్తలూరు గ్రామంలో పట్లోళ్ల సావిత్రి మృతి చెందగా, భర్త సాయిలుకు రూ. 5 లక్షల రైతుబీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ పార్వతీశంకర్గౌడ్, ఎంపీటీసీ దత్తుతోపాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.