చెన్నూర్ : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా పలువురికి మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ చెన్నూర్లో సోమవారం పంపిణీ చేశారు. చెన్నూర్ పట్టణానికి చెందిన జి. సునీతకు రూ. 60,000, చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన సంతోష్కు రూ 30,000, నెన్నెల మండలం కుష్నపల్లి గ్రామానికి చెందిన స్వప్నకు రూ 16,000, కోటపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్యకు రూ. 28,000 మంజూరు కాగా వాటి చెక్కులను ఎమ్మెల్సీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోతె తిరుపతి, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, జగన్నాథుల శ్రీను, దోమకొండ అనీల్, జోడు శంకర్, కో-ఆప్షన్ సభ్యులు కేవీఎం శ్రీనివాస్, అయూబ్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, వేముల మహేందర్, మేడ సురేశ్రెడ్డి, నాయిని సతీశ్, కొండపర్తి వెంకటరాజం, తదితరులు పాల్గొన్నారు.