కోయిలకొండ, నవంబర్ 23 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి అన్నారు. మండలంలోని గార్లపాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవా రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటగా గార్లపాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రారంభించారని, ఇక్కడ ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసినట్లు తెలిపారు. వానకాలం వరిసాగు పెరగడంతో మండలంలో మరో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర కు విక్రయించాలని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్విం డో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు కృష్ణయ్య, ఆంజనేయులు, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు సమి తి మండల కన్వీనర్ మల్లయ్య, ఏవో రాంపాల్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, భీంరెడ్డి, శ్రీపాదరావు, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.