మహ్మదాబాద్, మార్చి 7 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభు త్వం ఏర్పడి 90 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంపై జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాడన్నారు. మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలిపి చార్మినార్ జోన్లో చేర్చుతామని బహిరంగసభల్లో రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తే నియామకపత్రాలిచ్చి ఉద్యోగాలు తామిచ్చామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు.
రూ.2లక్షల రుణమా ఫీ ఏమైంది? రూ.4వేల పింఛన్, మహిళలకు రూ.2,500, రూ.500కే ఇస్తామన్న గ్యాస్ స బ్సిడీ వంటి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్, చేవెళ్ల, మ హబూబ్నగర్ బహిరంగ సభల్లో తన హోదా కు తగ్గట్టు మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. కొం దరు గిట్టనివారు బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, అలా జరిగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సమావేశంలో డైరెక్టర్ వెంకటయ్య, మాజీ సర్పంచు లు వెంకట్రాంరెడ్డి, అంజిలయ్య, కిరణ్కుమార్రెడ్డి, రాజేశ్వర్, నాయకులు రాంచంద్రారెడ్డి, కేశవులు, వెంకటయ్య, సాయి, శివ ఉన్నారు.