మూసాపేట(అడ్డాకుల), జనవరి 11 : యువత క్రీడల్లో రాణించాలని జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని అడ్డాకుల మండలం కందూరులో ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. టోర్నీలో 30 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీ శ్యామలమ్మ, రంగన్నగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, రమేశ్గౌడ్, నరేందర్చారి, శ్రీనివాసులు, చంద్రమౌళి, నాగన్న పాల్గొన్నారు. అదేవిధంగా జాతీయ యువజన ఉత్సవాలను పురస్కరించుకొని పోలీసుశాఖ ఆధ్వర్యంలో అడ్డాకులలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ఎంపీపీ నాగార్జునరెడ్డి, ఎస్సై విజయకుమార్ ప్రారంభించారు. టో ర్నీలో 6 జట్లు పాల్గొనగా, అడ్డాకుల ఎస్సీకాలనీ జట్టు విజేతగా, ఆదర్శ జట్టు రన్నర్గా నిలిచినట్లు తెలిపారు.
రాజాపూర్, జనవరి 11 : జాతీయ యు వజన ఉత్సవాల్లో భాగంగా రాజాపూర్లో బుధవారం మండలస్థాయి వాలీబాల్ పోటీలను ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్ ప్రారంభించారు. అంతకుముందు సీఐ జములప్ప, ఎస్సై వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాంబాయి, ఎంపీడీవో లక్ష్మీదేవి, హెచ్ఎం ఆనంద్కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహు లు, బీఆర్ఎస్ యూత్వింగ్ అధ్యక్షుడు వెం కటేశ్, కోఆప్షన్ సభ్యుడు అల్తాఫ్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీశైలం, రమేశ్నాయక్ ఉన్నారు.
దేవరకద్ర రూరల్, జనవరి 11 : క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మం డల నెల్లికొండిలో బుధవారం జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము, సర్పంచ్ వెంకటేశ్ పాల్గొన్నారు.
నవాబ్పేట, జనవరి 11 : క్రీడలతో స్నే హభావం పెంపొందుతుందని ఎస్సై పురుషోత్తం అన్నారు. జాతీయ యువజనోత్సవాలను పురస్కరించుకొని మండలకేంద్రంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో మండలస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన టోర్నీలో నవాబ్పేట జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ఇప్పటూ ర్ ఉపసర్పంచ్ దుబ్బ రవికిరణ్ రూ.10వే లు, రన్నర్గా నిలిచిన ఇప్పటూర్ జట్టుకు బీఆర్ఎస్ యూత్వింగ్ మండల అధ్యక్షుడు మెండె శ్రీను రూ.5వేల నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్గౌడ్, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చెన్నవీరయ్య, నర్సింహు లు, ప్రకాశ్, మల్లేశ్ పాల్గొన్నారు.