అలంపూర్, ఫిబ్రవరి 27: అలంపూరు క్షేత్రంలోని జోగుళాంబ, బాలబ్రహ్శేశరస్వామి ఆలయాలను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సోమవారం దర్శించుకున్నారు. అంతకుముందు ఆమెకు ఆలయకమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆమెను శేషవస్ర్తాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికా రు.
అనంతరం చైర్మన్ చాంబర్లో తేనీటి విందు స్వీకరించారు. ఆలయంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్నసత్రం నిర్వహణకు కేంద్ర పురావస్తుశాఖ అనుమతులిస్తే నిత్యాన్నదాన సత్రాన్ని విస్తరించడానికి అనువుగా ఉంటుందని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.