అలంపూర్, డిసెంబర్ 10 : నమ్మిన వారికి కొంగు బంగారమై కోరిన కోర్కేలు తీర్చే మహిమ గల స్వామిగా నిత్యానం దస్వామి దశాబ్దాలుగా భక్తులతో ఆరాధించబడుతున్నాడు. క్షేత్రాన్ని దర్శించుకుంటే నిత్యానందం పొం దుతారని భక్తుల నమ్మకం. నిత్యానంద స్వామి జీవ సమాధి ఆశ్రమం వద్ద ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజు ఆరాధనోత్సవాలు నిర్వ హిస్తారు. కులమతాలకతీతంగా నిర్వహించే ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఆరాధన ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్కజిల్లాలు, రాష్ర్టాలు (తమిళనాడు) నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆరాధనోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనునన్నారు.
తమిళనాడు రాష్ట్రం తిరుణల్వేలి జిల్లా కోయిల్పట్టి నియోజకవర్గంలోని యళ యరసనందల్ గ్రామానికి చెందిన ని త్యానంద స్వామిది ఆధ్యాత్మిక కుటుంబం. రుక్ష్మిణమ్మ, అప్పస్వామి దంపతులకు రెండో కుమారుడుగా ఈయన జన్మించారు. మొదటి నుంచి చదువుపై ఆసక్తి కనబర్చని స్వామి దైవ చింతనతో నిత్యంకాలం గడిపేవారు. రోజువారి క్ర మంలో భాగంగా మధుర మీనాక్షి ఆలయంలో స్వామి ధ్యా ననిష్టలో నిమగ్నమై ఉండగా, గమనించని పూజారులు ఆలయ గడియ పెట్టి వెళ్లిపోయినట్లు చెబుతారు. ఆరోజు రాత్రే స్వామికి మీనాక్షిదేవి ప్రత్యక్షమై జ్ఞానోదయం కల్గించగా, ప్రాణాయమా వి ద్యను అభ్యసిస్తానని తలి ్లరుక్ష్మిణమ్మతో చెబుతాడు. చిన్న వయ స్సులో నీకు తగదని తల్లి వారిస్తుంది. పట్టువీడని నిత్యానం దస్వామి శివ పరమాత్మను కోరుతూ తపస్సు చేశాడు. అనంతరం విమలానందస్వామి వద్ద శిశ్యరికం పొందాడు. మంత్రోపదేశం అనంతరం సన్యాసం స్వీకరించి దేశ పర్యటన కోసం బయ లుదేరాడు. కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో ధనుశ్యాల అనే ప్రదేశంలో స్వామి క్రూరమృగాల మధ్య ఘోర తపస్సు చేసి భగవంతుడి అనుగ్రహం పొందాడు.
అలా కొంతకాలం గడిచాక ఉపదేశం చేస్తూ గ్రామాలు సంచరిస్తూ క్రమంగా జోగుళాంబ గ ద్వాల జిల్లా అలంపూర్ తాలుకా లింగనవాయి గ్రామం చేరుకు న్నాడు. గ్రామస్తులు ఆయనను ఆరాధించటంతో అక్కడే స్థిరపడి పోయాడు. ఆయనకు అక్కడ కొంతమంది శిశ్యరిక బృందం కూడా ఏర్పడింది. క్రమంగా అక్కడ ఆశ్రమం వెలిసింది. ఆశ్రమ వ్యవస్థాపకులు కీ.శే.శివానందస్వామి ఆశ్రమ అభివృద్ధి కోసం కృషి చేశారు. నిత్యానంద స్వామి ప్రత్యక్ష శిశ్యుడైన కీ.శే.సానేవోనే స్వామి ఆశ్రమ అభివృద్ధి కోసం 10ఎకరాల వ్యవసాయ భూమిని దానం చేశారు. శివానంద స్వామి తోటి శిశ్యుల సహకారంతో 1952లో ఆశ్రమ నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉండగా, నిత్యానందస్వామి 1959 నవంబర్ 30వ తేదీన లింగనవాయి ఆశ్రమంలోనే జీవసమాధి అయ్యారు. ప్రముఖ చరిత్రకారుడు కీ.శే.గడియారం రామకృష్ణ శర్మ, దేవి ఉపాసకులు కర్నూల్ సంజీవప్ప, బెక్కెం హరిసింగ్ ఠాకూర్ శిశ్యరికం పొంది నిత్యానందస్వామి జీవిత చరిత్రను రచించినట్లు ఆధారాలు చెబుతున్నాయి.
నిత్యానంద స్వామి జీవసమాధి అయినప్పటి నుంచి నేటి వరకు ఆశ్రమం వద్ద ఆరాధనోత్సవాలు ప్రతి ఏడాది నిర్వహిస్తూనే ఉన్నారు. స్వామివారి వద్ద కీ.శే.చంద్రశేఖర్రెడ్డి, కీ.శే.రాజశేఖర్రెడ్డి, బైరెడ్డి పెద్దశివారెడ్డి, పొడుపు చిన్నారెడ్డి, లక్ష్మన్నగౌడ్ శిశ్యురికం చేశారు. ప్రస్తుతం రామదాసు, రమణగుప్త, స్వామిశెట్టి,పూజారి కురుమూర్తి, రాముడు తదితర గ్రామ పెద్దలు నేటికి ఆశ్రమ అభివృద్ధి సహకరిస్తూనే ఉన్నారు. కార్తీక అమావాస్య సందర్భంగా మంగళవారం నిర్వహించే ఆరాధనోత్సవాలకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
11వ తేదీన కలశ స్థాపన, దేవతల ఆహ్వానం, లక్ష్మీ గణపతి హోమం, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వ హిస్తారు. 12న ఉదయం 8గంటలకు నవగ్రహోమం, మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ, రుద్రాభిషేకా లు, స్వామివారి పాదుక పూ జ, అలాగే భక్త బృందా లతో సంకీర్తన కార్య క్రమాలు నిర్వహించనున్నారు.