మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 3 : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వ యోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివా రం మహబూబ్నగర్ పట్టణంలోని అం బేద్కర్ కళాభవన్లో అంతర్జాతీయ ది వ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించా రు. కార్యక్రమానికి ముంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి విభజించి దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ల సా ధికారత సంస్థగా మార్చుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3,016 పింఛన్లను వారికి అందజేస్తున్నట్లు చెప్పారు.
దేశంలోనే మొట్టమొదటి మొబైల్ యా ప్ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు. వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. విద్య, ఉద్యోగాల్లో కోటా అమ లు పక్కాగా చేస్తున్నామని చెప్పారు. శా ఖకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడుతామన్నా రు. మహిళలపై హింస, వివక్ష అంతంపై చేపట్టిన సంతకాల సేకరణను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వం దివ్యాంగు ల శాఖను ఏర్పాటు చేయడంపై మంత్రి సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాబిషేకం చేశారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీడబ్ల్యూ వో జరీనాబేగం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ తదితరులున్నారు.
భూత్పూర్, డిసెంబర్ 3 : పాలమూ రు పారిశ్రామికంగా ఎదుగుతున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద కంపెనీ అమరరాజా కంపెనీ తెలంగాణలో ఏర్పాటు కావడం అదృష్టమన్నారు. పాలమూరును పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఐదేండ్ల కిందటే స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కంపెనీలు చాలా వచ్చాయి.. కానీ పెద్ద పెద్ద కంపెనీ కోసమే స్థలాన్ని ఇవ్వలేదన్నారు.
ఈ పనులు పూర్తయితే 10 వేల మంది యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇందులో ము ఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొర వ ఎంతో ఉన్నదన్నారు. పాలమూరు వ లసల జిల్లాగా గతంలో పేరుండేదని, అందుకే ఆ పేరును రూపుమాపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేసిందన్నా రు. పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి వ్యవసాయరంగంతో పాటు, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి అన్నారు. మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్ల పట్టణాలను కలుపు తూ ఏర్పాటు చేసిన ముడాకు నిధులను సమకూర్చి మహానగరంగా మారుస్తానని చెప్పారు.
కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి, గిరిజన సంక్షేమ సంఘం చైర్మన్ వాల్యానాయ క్, జెడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, ఎంపీపీ శేఖర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, నా యకులు సత్తూర్ నారాయణగౌడ్, వెం కటయ్య, గడ్డంరాములు, సురేశ్గౌడ్, శ్రీనివాసులు, ప్రేమ్కుమార్ ఉన్నారు.