దేశానికే ప్రయోగశాలగా తెలంగాణ పథకాలు
ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
రూ.6కోట్ల 23లక్షల 70వేల దళితబంధు చెక్కు అందజేత
తెలంగాణ దేశానికి ప్రయోగశాల కానున్నదని ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లో 62మంది దళితబంధు లబ్ధిదారులకు రూ.6కోట్ల 23లక్షల 70వేల విలువ చేసే చెక్కును అందజేశారు. దళితులు చదువుకుని ఆర్థికంగా బాగుపడినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు.
మహబూబ్నగర్ టౌన్, జూన్ 26 : తెలంగాణ దేశానికి ప్రయోగాశాల కానున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ ము న్సిపల్ పరిధిలోని క్రిస్టియన్పల్లిలో దళితబంధు పథకం కింద 8మంది లబ్ధిదారులకు కలిపి రూ.80లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్టీల్, సిమెంట్ ట్రేడర్స్ను, మీసేవ యూనిట్ను, జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దళితబంధు కింద ఎంపిక చేసిన 62మంది లబ్ధిదారులకు రూ.6కోట్ల 23 లక్షల 70వేల చెక్కు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రెండు కార్లు, బోయపల్లిలో 4 సెంట్రింగ్ యూనిట్లు, 2 ట్రాక్టర్ యూనిట్లను, కారును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పథకాలు భవిష్యత్తు లో దేశవ్యాప్తంగా అమలు కానున్నాయన్నారు. దళితబంధు పథకాన్ని నిరంతరం కొనసాగిస్తామన్నారు.
దళితులు చదువుకొని ఆర్థికంగా బాగుపడినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యార్థులకు హాస్టల్, అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు కింద అర్హులైన ప్రతి కుటుంబానికీ రూ.10లక్షలు ఇస్తున్నామని తెలిపారు. దశలవారీగా అందరికీ దళితబంధు పథకం అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద దుకాణాలు పెట్టిన వారి వద్దే ప్రభుత్వ పథకాలకు సిమెంట్, స్టీల్ తీసుకునే విధంగా సహకారం అందిస్తామని తెలిపారు. మహబూబ్నగర్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, బైపాస్, కొత్త కలెక్టరేట్, డబుల్ రైల్వేలైన్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీ నివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎస్పీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ యాదయ్యగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రాజేశ్, ఆంజనేయులు, కృష్ణమోహన్, ఎంపీపీ సుధాశ్రీ, కౌన్సిలర్లు రాణి, మోతీలాల్, నరేందర్, నర్సింహులు, శ్రీనివాసులు, నాయకులు వెంకట్రాములు, శరత్చంద్ర, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.