కొత్తకోట, అక్టోబర్ 21 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిపెస్టోపై శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఈదులబాయితండా, కానాయపల్లితండా, సంకిరెడ్డిపల్లితండాలో గిరిజన మహిళలకు ఎన్నికల మ్యానిపెస్టోలో అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వమని, మహిళలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మితోపాటు రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు, కౌన్సిలర్లు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్ వైస్చైర్ పర్సన్ జయమ్మ, కౌన్సిలర్లు సంధ్య, పద్మ, అయ్యన్న, రవీందర్రెడ్డి, తిరుపతయ్య, రామ్మోహన్రెడ్డి, ఖాజమైనొద్దీన్, రాములుయాదవ్, కొండారెడ్డి, బాలకృష్ణ, నిర్మాల, బీమా ప్రసన్నలక్ష్మి, బాబురెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, శ్రీనుజీ, నెహ్రూ పాల్గొన్నారు.
దేవరకద్ర, అక్టోబర్ 21 : బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధేయ్యమని ఎంపీపీ రమాదేవి, మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి పట్టం కట్టాలని ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎ మ్మెల్యే ఆలను అధిక మెజార్టీతో మారోసారి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీ కాంత్యాదవ్, వెంకటేశ్, కొండశ్రీనివాస్రెడ్డి, వెంకట్రాములు, చాల్మారెడ్డి, రాము, యుగేంధర్రెడ్డి, నగేశ్, రాధాకృష్ణ, పురేందర్గౌడ్ ఉన్నారు.
భూత్పూర్, అక్టోబర్ 21 : బీఆర్ఎస్ నాయకులు మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్భంగా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. పార్టీని గెలిపించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, మాజీ సర్పంచులు నారాయణగౌడ్, సత్యనారాయణ, నాయకులు సత్యనారాయణ, మురళీధర్గౌడ్, నర్సింహులు ఉన్నారు.
మదనాపురం, అక్టోబర్ 21 : దేవరకద్ర ని యోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి అండగా ఉంటామని మదనాపురం మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి అన్నారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల దేవరకద్ర నియోజకవర్గంతోపాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడని, ఇ లాంటి నాయకుడు దొరకడం నియోజకవర్గ ప్రజ ల అదృష్టమన్నాడు. మరింత అభివృద్ధి జరగాలం టే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకు లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.