మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 27 : సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేశామని, అన్ని పార్టీల వారిని ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. అడ్డాకుల మండలంలోని రాచాలలో ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో విస్తృతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
35 రోజులు బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కార్యకర్తలు పనిచేస్తే ఐదేండ్లు ప్రజల మేలు కోసం నేను పనిచేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ రాధిక, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.