జడ్చర్ల టౌన్, డిసెంబర్ 31 : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని బేకరీలు, మాంసం, మద్యం దుకాణాల వద్ద జనం సందడి కనిపించింది. బేకరీలతోపాటు పట్టణ ప్రధాన కూడళ్లలో కేక్ల విక్రయ దుకాణాలు కిటకిటలాడాయి. ఆదివారం అర్ధరాత్రి 12గంటలు దాటగానే యువకులు డ్యాన్స్లు చేస్తూ ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
సీఐ రమేశ్బాబు పర్యవేక్షణలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని వివిధ చర్చీల్లో అర్ధరాత్రి క్రైస్తవులు కేక్ కట్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజకీయ పార్టీల నాయకులు పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు.