– జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, జనవరి 24: నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్లాట్లుగానీ, ఏ విషయాల్లోనూ ప్రజలకు నష్టం జరగకుం డా చూస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రియల్ఎస్టేట్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీపై కొందరు నిందలు వేయడం తగదన్నారు. రియల్ఎస్టేట్ అనేది ఓ బిజినెస్ అని, దానిపై వేలాదిమంది బతుకుతున్నారన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత అభివృద్ధితోపాటు రియల్ఎస్టేట్ బిజినెస్ పెరిగిందన్నారు. చాలామంది ప్రభుత్వంపై మాట్లాడటం రొటీన్ అయ్యిందన్నారు. జడ్చర్ల ప్రాంతంలో 30-40ఏండ్ల కిందట లేఅవుట్లు చేశారని, గ్రామపంచాయతీ పర్మిషన్ ఇచ్చిందని, ఒక ప్లాటుకు రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేశారని, కొన్నిచోట్ల రోడ్డును కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే జరిగాయని గుర్తుచేశారు. మాచారం శివారులోని వెంకటాద్రి వెంచర్లో కొంతమంది ప్లాట్లను చదును చేశారని తనకు ఫోన్ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినవారికి నష్టం జరగకుండా చూస్తానని తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేశానన్నారు. చదును చేసిన వారిపై కేసు కూడా నమోదు చేశారన్నారు.
రియల్ఎస్టేట్ బిజినెస్ ఎవరైనా చేయవచ్చని కానీ, ప్రజలకు నష్టం జరగకుండా చూడాలన్నారు. కొందరు అనవసరంగా బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు తప్పుచేయరని, ఒకవేళ చేసినట్లు తన దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వాలు చేసిన అర్థంలేని విధానాల వల్లనే ఇవ్వన్నీ జరుగుతున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నూతనంగా లేఅవుట్లు చేసే వారికి డీటీసీపీ, ముడా లేఅవుట్లు ఉంటేనే పర్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో వాల్యానాయక్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, రఘురాంగౌడ్, లత, మూడా డైరెక్టర్లు ఇమ్మూ, శ్రీకాంత్, పిట్టల మురళి, శ్రీశైలంయాదవ్, రామ్మోహన్, శంకర్నాయక్, గిరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.