మహబూబ్నగర్, జనవరి 2 : మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందజేసిన డబుల్బెడ్రూం ఇండ్లపై సమగ్ర విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మం గళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులకు ఇండ్లను కేటాయించేందుకు విచారణ చేయిస్తామన్నారు. సర్వేనెంబర్ 523లో పేదలకు ఇండ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని, మిగిలిన ఇండ్లను కూడా కేటాయించి న అనంతరం మిగతా వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టులకు ఇ చ్చిన ప్రతి ఇంటిపై విచారణ చేయాలని అధికారులకు ఇప్పటికే సూచించామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు మాత్రమే డబుల్బెడ్రూం ఇండ్లు అందాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటునట్లు వివరించారు. మహబూబ్నగర్లో ట్రిపుల్ఐటీని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డితో చర్చించామని, స్థల సేకరణకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడినటు పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ కళాశాల పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉండాలా, జేఎన్టీయూ పరిధిలో ఉండాలనేది సమగ్రంగా చ ర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతమున్న జనరల్ దవాఖాన పరిధిని మరింతగా విస్తరించి సూపర్ స్పెషాలిటీగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఐటీ టవర్లో వివిధ కంపెనీలను ఆహ్వానించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తన పుట్టిన రోజున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, బొకేలు, పూలదండలు తీసుకురాకుండా పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు తదితర అవసరాలను తీర్చాలని కోరారు. సమావేశంలో నాయకులు సురేందర్రెడ్డి, సిరాజ్ఖాద్రి, లక్ష్మణ్యాదవ్, సుధాకర్రెడ్డి, అజ్మత్అలీ, బెనహర్ పాల్గొన్నారు.