భూత్పూర్: ఎవ్వరు ఎన్ని అవంతరాలు సృష్టించినా కరివెన ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సాగు నీరందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వల సల జిల్లాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రూ.45వేల కోట్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రాజెక్టు మంజూరైనప్పటి నుంచి ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ఎన్నో రకాల కుట్రలు పన్ని చివరకు కోర్టు ద్వారా స్టే తీసుకు రావడం సిగ్గుచేటని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మాణంపై స్టే రావడం పట్ల కొందరు కాంగ్రేస్, బీజేపీ పార్టీ నాయ కులు టపాకాయలు కాల్పడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు పూర్వయితే నీళ్లు వస్తే ఎన్ని కుటుంబాలు సంతోషంగా జీవిస్తాయని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ఇంకా ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగడం సిగ్గుచేటని అన్నారు. ఇటు వంటి స్టేలు ప్రాజెక్టు నిర్మాణాన్నిఅడ్డుకోలేవని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రజానీకమంతా టీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడాలని ఆయన కోరారు. అనంరం 68మందికి రూ.32లక్షల, 69వేల 50లను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
సీడీపీ నిధుల ద్వారా మూసాపేట మండల కేంద్రంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి కూ.4లక్షల ప్రొసిడింగ్ను, నిజాలపూర్ గ్రామంలో వంశరాజుల భవన నిర్మాణానికి రూ.5లక్షల ప్రొసిడింగ్, సంకల్మద్ది గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి రూ.5లక్షల ప్రొసిడింగ్లను అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా సీడీపీ నిధులు మంజూరు కానందున ఇవ్వలేక పోయానని ఇప్పుడు మంజూరైనందున ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
అంతేకాకుండా దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన భవానికి సర్జరీ కోసం డబ్బులు కావాలని వాట్సాప్ ద్వారా చూసి ఎమ్మెల్యే స్పందించి రూ.లక్ష ఎల్వోసీ అందజేసినట్లు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మ న్ వామన్గౌడ్, జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ నాగార్జునరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, జెట్టి నర్సింహా రెడ్డి, లక్ష్మీ నర్సింహాయాదవ్, శ్రీకాంత్యాదవ్, మనెమోని సత్యనారాయణ, పొనకల్ మహమూద్, కొండయ్య పాల్గొన్నారు.