వనపర్తి రూరల్, ఏప్రిల్ 22 : యాసంగిలో పం డించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరె డ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రాజపేటలో రాజనగరం పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసింగిలో రాష్ట్రవ్యాప్తంగా 56.44 లక్ష ల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. అందుకు త గ్గట్టుగా ప్రభుత్వం పీఏసీసీఎస్, ఐకేపీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వనపర్తి జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల్లో వరి సాగైందని, అందుకనుగుణంగా దిగుబడి 4.20లక్షల టన్నులు వస్తుందని.. అందుకు అనుగుణంగా 25 7 కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొ నుగోలు సమయంలో తరుగు తీయొద్దని అధికారులను ఆదేశించామన్నారు. మిల్లర్లు తరుగు తీస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించా రు. అవసరమైనన్ని గన్నీ బ్యాగులు అందుబాటు లో ఉన్నాయన్నారు. అన్నిశాఖాల అధికారులు స మన్వయంతో ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలన్నారు. దేశంలో ధాన్యాన్ని వందశాతం కొనుగో లు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. ఇం దుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతును రాజుగా చూ డాలన్న ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరుతున్నదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, రాజనగరం పీఏసీసీఎస్ చైర్మన్ రఘువర్ధన్రెడ్డి, సర్పంచ్ జ్యోతి మాధవ్రెడ్డి, రాష్ట్ర మార్కెట్కమిటీ డైరెక్టర్ విజయ్కుమార్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, నాగవరం పీఏసీసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాణిక్యం, సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీ శాంతమ్మ, మాజీ ఎంపీటీసీ శ్రీనునాయక్, పెద్దతండా సర్పంచ్ జయరాములు, వేణురెడ్డి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు వేమారెడ్డి, సహకారసంఘం డైరెక్టర్లు సతీశ్సాగర్, జయరాములు, సత్యనారాయణరెడ్డి, రాములు, శివశంకర్రెడ్డి, కురుమయ్య పాల్గొన్నారు.
పెద్దమందడి, ఏప్రిల్ 22: తరుగు తీసే మిల్లర్ల లైసెన్సులను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. పెద్దమందడితోపాటు మండలంలోని మనిగిల్ల, అ ల్వాల, చిన్నమందడి, పామిరెడ్డిపల్లి, జంగమాయిపల్లి, బలిజపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలను రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాశ్రెడ్డి, వ్యవసాయాధికారి కురుమయ్య, సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ మన్యపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొమ్ము వెంకటస్వామి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు, గొర్రెలకాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ నాగేంద్రంయాదవ్, మార్కెట్కమిటీ డైరెక్టర్ శివశంకర్, సింగిల్విండో వైస్చైర్మన్ కుమార్యాదవ్, తాసీల్దార్ సంధ్య, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.