మహబూబ్నగర్, మే 24 : ఆకలితో ఉన్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టిన వారిని మన జీవితంలో మర్చిపోలేము. అలాంటిది మా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు తిప్పని ఆసుపత్రులు లేవు. అప్పుడు దినదిన గండంలా గడిచేది మా కుటుంబానికి. ఆ పరిస్థితుల్లో మమల్ని పలుకరించేందుకు ఎవరూ వచ్చేది కాదు. నాపేరు అంజమ్మ.. నేను టైలరింగ్ చేస్తుంటాను. మా ఆయన పేరు బదిగే శ్రీనివాసులు. మాకు నలుగురు పిల్లలు (భవన చంద్ర, మణిదీపక్, సాయితేజ, శ్రీనిధి), మా అత్తమ్మ పేరు శాంతమ్మ. భువన చంద్ర, మణిదీపక్లు ఇద్దరూ ప్రస్తుతం సెంట్రింగ్ పనిచేస్తున్రు. సాయితేజ 7వ తరగతి, శ్రీనిధి 5వ తరగతి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ చదువుతున్నారు. మాకు పెంకుటిల్లు ఉన్నప్పుడు వర్షం వస్తే పూర్తిగా ఇంట్లో కురిసేది. ఆ సమయంలో పడుకోవడానికి కూడా చోటు ఉండేది కాదు.
మాకు ఉన్న భూమిలో కొంత అమ్మి ఇల్లు కట్టుకున్నాం. మా ఆయనకు లివర్తోపాటు కిడ్నీ వ్యాధి కూడా ఉందని డాక్టర్లు చెప్పిండ్రు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నప్పుడు మంత్రి శ్రీనివాస్గౌడ్ డాక్టర్లతో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.లక్ష ఆర్థికసాయం అందించిన్రు. వైద్యం అయిపోయిన తర్వాత 2023 ఫిబ్రవరి 11న నా భర్త చనిపోయిండు. బోయపల్లి శివారులో మాకు రెండెకరాల భూమి ఉంది. ఈ భూమి మా ఆయన పేరు మీద ఉండడంతో రైతుబీమా వర్తించి రూ.5లక్షలు 2023 మార్చి 24న మా బ్యాంక్ ఖాతాలో జమచేసిండ్రు. డబ్బులు వచ్చిన కొద్ది రోజులకు మా అత్తమ్మకు పక్షవాతం వచ్చింది. వచ్చిన బీమా డబ్బులతో అప్పులు తీర్చి అత్తమ్మ వైద్యానికి ఖర్చు పెట్టాం. ఇప్పటికీ నేను టైలరింగ్ చేస్తున్నాను. పిల్లలు కూడా అదే పని కొనసాగిస్తుండ్రు. ఇప్పటికైతే కుటుంబ పరిస్థితి కొంత మంచిగానే నడుస్తుంది. సీఎం కేసీఆర్ సారు, మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్న మాకు దేవుడితో సమానం. మా కుటుంబం గిప్పుడు సంతోషంగా బతుకుతుందంటే వాళ్లే కారణం. మా జీవితాంతం వారికి రుణపడి ఉంటాం.
– లబ్ధిదారురాలు అంజమ్మ, బోయపల్లి, మహబూబ్నగర్