మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 30 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట శివారులో చిరుత సంచారంతో జనం భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి స్థానిక కేటీఆర్ నగర్ డబుల్ బెడ్రూం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత కుక్కపై దాడిచేసినట్లు అటవీశాఖ సెక్షన్ అధికారి నిరంజన్ తెలిపారు.
అధికారులు చిరుత అడుగు జాడలను పరిశీలించారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 15 చిరుతలు ఉన్నాయని చెప్పారు. అటవీ ప్రాంతంలో ఒంటరిగా వెళ్లొద్దని ఆయన సూచించారు. ఎవరికైనా కనిపిస్తే సమాచారం అందించాలని సూచించారు.