వనపర్తి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : వానకాలంలో పండిన సన్న రకాల వడ్లకు మం చి డిమాండ్ ఉన్నది. పంట చేతికందకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. డిమాండ్ ఉందని తెలుసుకున్న రైతు లు కూడా ఇప్పుడే అమ్మమని, పంట చేతికొచ్చాకే ధర చెబుతామనడంతో వ్యాపారులు పోటీపడుతున్నారు. రైతులు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో బియ్యం కొరత ఏ ర్పడడంతో ఎగుమతిపై కేంద్రం 20 శాతం ప న్ను విధించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు రైతుల వద్దకు వెళ్లి.. తమకే అ మ్మాలని అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ధాన్యంలో తేమ, తాలు ఉన్నా ఫర్వాలేదని మిల్లర్లు, వ్యాపారులు చెబుతుండడం విశేషం. వనపర్తి జిల్లాలో 1.14 లక్షల ఎకరాల్లో బీపీటీ, గంగా కావేరి, ఆ ర్ఎన్ఆర్ రకాలను పండిస్తున్నారు. దీంట్లో కే వలం ముప్పై శాతం మాత్రమే సన్న రకాలు ఉ న్నాయి. సన్నరకానికి తెగుళ్లు ఎక్కువ సోకుతాయన్న ఉద్దేశంతో చాలా మంది రైతులు దొడ్లు రకం సాగు చేస్తున్నారు. జిల్లాలో 3.5 లక్షల ట న్నుల దొడ్లు వడ్లు, సన్నరకాలు కేవలం 1.50 ల క్షల టన్నులు మాత్రమే దిగుబడి వస్తుందని పౌ రసరఫరాలశాఖ అధికారుల అంచనా. అమరచింత, ఆత్మకూరు మినహా మిగతా మండలాల్లో కోతలు ఆలస్యంగా రానున్నాయి. నవంబర్ మొ దటి వారంలో కోతలు ప్రారంభమవుతాయనే అంచనాతో జిల్లా పౌరసరఫరాలశాఖ బుధవా రం కలెక్టరేట్లో స్టేక్హోల్డర్స్తో సమావేశం కా నున్నారు. వారి సూచనల ప్రకారం కొనుగోలు కేంద్రాల సంఖ్య, తేదీ, ప్రాంతాలను నిర్ణయించనున్నది. కాగా, సన్నరకాలు పండిస్తున్న వారి ఇంటి చుట్టూ వ్యాపారులు ప్రదక్షిణలు చేస్తున్నా రు. అవసరమైతే డబ్బు ముందే ఇస్తామని చెబుతున్నారు. గోపాల్పేట, రేవల్లి, పెద్దమందడి, చి న్నంబావి, పాన్గల్, వీపనగండ్ల, ఆత్మకూరు, అ మరచింత, పెబ్బేరు, మదనాపురం, కొత్తకోట మండలాల్లో సన్నవడ్లు ఎక్కువగా పండిస్తున్నారు.
కోతలు మొదలుకాక ముందే..
జిల్లాలో ఇంకా వరి కోతలు మొదలుకాలేదు. అయినా, కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. గ్రేడ్ ఏ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర ఉన్నది. తాలు, మట్టిబెడ్డలు లేకుండా కల్లాల్లో ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. తేమ కూడా 17 శాతానికి మించొద్దు. ఈ క్రమంలో తేమ, తాలుతో పనిలేకుండా కొనుగోలు చేస్తామని వ్యాపారులు హామీ ఇస్తున్నారు. గతేడాది సన్నాలకు డిమాండ్ లేదు. ఈ దఫా భారీగా డిమాండ్ ఉండడంతో రైతులు కూడా అమ్మడానికి తొందరపడడం లేదు. అమరచింత, మదనాపురం, ఆత్మకూరు మండలాల్లో పొలాలు కోతకు వచ్చినా.. అకాల వర్షాలకు భయపడి కోయడం లేదు. వర్షాలు తగ్గితే ఎక్కువ మొత్తంలో కోతలు మొదలుపెట్టాలని రైతులు భావిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలతో పనిలేకుండా..
ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలతో పనిలేకుండా రైతులు ప్రైవేట్ వ్యాపారులకు సన్న రకాలు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. మద్ధతు ధరకు మించి ధర పలుకుతుండడంతో ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. క్వింటాకు రూ.2,500 ధరతో కల్లాల వద్దే కొనుగోలు చేసేందుకు మన రాష్ట్రంతోపాటు ఏపీ, కర్ణాటక వ్యాపారులు పోటీపడుతున్నారు. ముఖ్యంగా సూర్యాపేట, వరంగల్, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో సన్న ధాన్యానికి డిమాండ్ పెరిగి రైతులు లాభపడే అవకాశం ఉన్నదని చర్చించుకుంటున్నారు. ధాన్యం ఎలా ఉన్నా.. సన్న రకమైతే చాలు అనే భావనలో వ్యాపారులు ఉండగా, ఎలాగైనా సరే డిమాండ్ ఉన్నప్పుడే అధిక ధరకు అమ్ముకుందామని రైతులు నిర్ణయించుకున్నారు.
దొడ్డు రకమే ఎక్కువ..
వనపర్తి జిల్లాలో సన్నరకం ధాన్యం దిగుబడి తక్కువగా రానున్నది. చాలా మంది రైతులు దొడ్డు వడ్లు సాగు చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. దొడ్డురకం వడ్లు మూడున్నర లక్షల టన్నుల దిగుబడి రానున్నట్లు భావిస్తున్నాం. సన్నరకాలు కేవలం లక్షన్నర టన్నులు మాత్రమే వస్తుందని అంచనా. అయితే, రైతులు సన్నరకాలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తక్కువగా తీసుకొస్తారని అనుకుంటున్నాం. వ్యాపారస్తులు మద్దతు ధర కంటే ఎక్కువగా ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇది ఒక రకంగా మంచిదే. రైతులకు లాభం జరగడమే కాకుండా.. ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం తగ్గే అవకాశమున్నది. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి డీఆర్డీవో వంటి స్టేక్హోల్డర్స్తో సమావేశం కానున్నాం. కేంద్రాల సంఖ్య, మౌలిక సౌకర్యాల వంటి వాటిపై నిర్ణయం తీసుకుంటాం.
– కొండల్రావు, పౌరసరఫరాల శాఖ మేనేజర్, వనపర్తి