వనపర్తి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : మా ర్కెట్లో కల్తీ నూనెలు విక్రయిస్తుండడం, జంతు కళేబరాలు, ఎముకలు, కొవ్వు నుంచి నూనె తయారీ చేస్తుండడం.. వంటి ప్రచారం జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో కల్తీలేని నూనెల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గానుగ నుంచి తయారుచేస్తున్న స్వచ్ఛమై న నూనె కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ కంపెనీ నూనె నాణ్యమైనదో, ఏది కల్తీ అవుతుందో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమం లో గానుగ నూనెకు డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో గానుగతో మరాడించి నూనెతీసే యంత్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. యువత ఈ గానుగ నూనె విక్రయాలను ఉపాధిగా ఎంచుకుంటున్నారు. నువ్వులు, పొద్దు తిరుగుడు, పల్లీలు స్వయంగా కొనుగోలు చేసి నూనెగా మరాడించుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వివిధ కంపెనీల నూనెలు లీటర్కు రూ.150 వరకు అమ్ముతున్నారు. అయితే, రెగ్యులర్గా దుకాణాల్లో కొనుగోలు చేసే నూనెతో పోలిస్తే గానుగ నూనెకు ఎక్కువ ధర ఉన్నా.. ప్రజలు ఆరోగ్యాన్ని అందించే నూనెకే పెద్దపీట వేస్తున్నారు. ఒక కిలో గింజలు గానుగ పట్టిస్తే కేవలం 350 గ్రాముల నూనె వస్తుంది. మార్కెట్లో అమ్మే నూనెతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ధర పలుకుతుంది. గానుగ నూనె ధర దాదాపు మూడింతలు ఎక్కువ. లీటర్ పల్లి నూనె రూ.330 నుంచి రూ.365 వరకు విక్రయిస్తున్నారు. గానుగ లేదా యంత్రం ద్వారా పట్టించిన నూనె కిలోకు చెల్లించిన డబ్బులతో బహిరంగ మార్కెట్లో బ్రాండ్ల పేర విక్రయించే నూనె మూడు కిలోలు వస్తుంది. ఆర్థికంగా భారమైనా స్వయంగా తయారు చేసుకునే నూనెకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. గానుగ నూనె ద్వారా థైరాయిడ్ వంటి పీసీవోడీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతున్నది.
ఓల్డ్ కల్చర్.. నయా థింకింగ్..
గానుగ నూనె వ్యవహారం పాతదైనప్పటికీ.. ప్రస్తుతం సరికొత్తగా ఆలోచించే నేటి తరం అదే కరెక్ట్ పద్ధతి అని చెబుతున్నారు. దీంతో పట్టణాల నుంచి ప ల్లెల వరకు గానుగ నూనె వాడకం పెరిగింది. అమ్మకాల కోసం ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. వినియోగదారుడు విత్తనాలు తెచ్చుకుంటే మరాడించి నూనె తీసివ్వడంతోపాటు యంత్రాలు నడిపే యజమానులు సైతం తమ డబ్బులతో గింజలు కొనుగోలు చేసి నూనెగా మార్చి అమ్ముతున్నారు. పిండిగిర్నీలు నడిపే వారు కూడా గానుగ యంత్రాలు తీసుకొచ్చారు.
డిమాండ్ పెరుగుతున్నది..
మార్కెట్లో వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయించే నూనెలో కల్తీ ఉన్నట్లు ప్రచారం ఉన్నది. దీంతో గానుగ నూనెకు డిమాండ్ పెరుగుతున్నది. పల్లీలే కాకుండా పొద్దు తిరుగుడు వంటి గింజలు తెస్తే స్వచ్ఛమైన నూనె తీసి ఇస్తున్నాం. చాలా మంది వినియోగదారులు నా వద్ద కొనుగోలు చేస్తుంటారు. ఒక్కోసారి ఏడాదికి సరిపడా నూనె చేసుకునేందుకు గింజలు సిద్ధంగా ఉంచుకుంటారు. పల్లిపంట చేతికిరాగానే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బుడ్డలు, కుసుమలు, ఆముదం, నువ్వులు, కొబ్బరి నూనె కూడా తీస్తాం. అన్ని రకాల యంత్రాలున్నాయి. మా ఫాంహౌస్లో ఎద్దులతో తీసే గానుగ నూనెకు అధిక డిమాండ్ ఉన్నది.
– కొండారెడ్డి, వ్యాపారి, కొత్తకోట