వనపర్తి, అక్టోబర్ 1 : జిల్లా కేంద్రంలోని 18వ వార్డుకు చెంది న సువర్ణకు ఏడాది వయస్సులోనే తల్లి ఇందిర మ్మ మృతి చెందిం ది. తండ్రి కురుమ య్య కూలి పనులు చేస్తూ బిడ్డ సువర్ణతోపాటు కుమారులు సాయికుమార్, సురేశ్కుమార్, కళ్యాణ్కుమార్ను చ దివించాడు. సువర్ణ 7వ తరగతి చదువుతున్న సమయంలో టీబీ వ్యాధితో తండ్రి కూడా చనిపోయాడు. దీంతో కుటుంబ పరిస్థితి ఆగ్యమగోచరంగా మారింది. కొడుకుల చదువులు మధ్యలోనే ఆ గిపోయాయి. నాయనమ్మ పిల్లలను అక్కున చేర్చుకున్నది. అయి తే కుటుంబ పోషణ నిమిత్తం అన్నలు మేస్త్రీ వద్ద కూలి, పెయింటర్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. వారి చెల్లెలు సు వర్ణను ఇంటర్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదివించారు.
కూలి పనులు చేస్తూనే..
కాయకష్టం చేస్తూ.. కూలి పనులు చే స్తూ ముగ్గురు అన్నలు కుటుంబాన్ని నె ట్టుకొచ్చారు. అయితే చెల్లెలు పెండ్లీడుకు రావడంతో దిగులు మొదలైంది. తాము చేస్తున్న కూలి పనులతో వచ్చే డబ్బుతో కల్యాణం ఎలా చేయాలో అని మదనపడేవారు. ఇంత లో మంచి సం బంధం రావడంతో చెల్లి పెండ్లి జరిపించారు. 202 2 మే 14న వనపర్తికి చెందిన ఆంజనేయుల(ప్రైవేట్ ఉద్యోగితో) సువర్ణ కల్యాణాన్ని జరిపించారు. దాదాపు రూ.2 లక్షల వరకు అ ప్పు చేసి వేడుక జరిపించారు. అయితే వేడుక కో సం చేసిన అప్పు ఎలా తీర్చాలో అని దిగులుపడేవారు. సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంపై వార్డు కౌన్సిలర్ నుంచి తెలుసుకొని వెంటనే పథకానికి దరఖాస్తు చేశారు. స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సకాలంలో కల్యాణలక్ష్మి సాయం మంజూరు చేశారు. 2021 ఆగస్టులో కల్యాణలక్ష్మి చెక్కు రూ.లక్షా 116 సాయం అందుకున్న వారి ఆనందానికి ఆవధులు లేకుండాపోయాయి. చేసిన అప్పు కొంత మేర కూలి పనులతో తీర్చుకోగా.. మిగితాది కల్యాణలక్ష్మి సాయం అందడంతో అప్పు తీర్చారు. తోబుట్టువు పెండ్లి కోసం చేసిన అప్పు తీరడంతో ఇక తాము కూడా నిశ్చితంగా వివాహాలు చేసుకుంటామని ముగ్గురు సోదరులు సంతోషంతో చెబుతున్నారు. వీరితోపాటు ఆకు టుం బంలో ఆనందం వెల్లివిరుస్తున్నది. పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, సాయం మంజూరు చేసిన మంత్రి నిరంజన్రెడ్డికి రుణపడి ఉంటామని, జీవితం లో మరువలేమని వారు పేర్కొన్నారు.