వనపర్తి, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : ఈనెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే సీఎం బహిరంగ సభకు లక్షా 50 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం వనపర్తి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించా రు. అనంతరం నూతన కలెక్టరేట్ను పరిశీలించారు. కా ర్యాలయ సమీపంలో నిర్వహించనున్న సభా స్థలాన్ని సందర్శించారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. హెలిక్యాప్టర్ ద్వారా ఘణపురం మండలంలోని కర్నె తండాకు సీఎం కేసీఆర్ చేరుకొని ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసి అక్కడి నుంచి చిట్యాలకు చేరుకుని మార్కెట్ యార్డు, జిల్లా కేం ద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను ల బ్ధిదారులకు అందజేస్తారని, నూతన కలెక్టరేట్ను ప్రా రంభించిన అనంతరం ‘మన ఊరు-మన బడి’ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతారని తెలిపారు. అలాగే మెడికల్, నర్సింగ్ కళాశాలలు, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. జిల్లాలో సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టాలని ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం కాబోతున్నదన్నారు. ఈ ప్రాజెక్టు పనులు జరగకుండా కోర్టుల్లో వందలాది కేసులు వేసి అడ్డుకోవాలని చూశారన్నారు. అభివృద్ధి అడ్డుకుంటే ఆగదన్నారు. మిగిలిన ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్కు మెడికల్ కళాశాలలు, గద్వాల, వనపర్తికి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలల, మత్స్య కాలే జీ మంజూరు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ఆగమైందని, ఆకలి చావులు, ఆత్మహత్యలకు నిలయంగా ఉండేందని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ హయాంలో ఏడేండ్లలోనే పాలమూరులో సాగునీరు పరుగులు పెట్టిందన్నారు. ఎ న్నో ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కే సీఆర్కు పాలమూరు మీద ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అం దుతున్నదని, వచ్చే ఏడాది మరో 20 నుంచి 30 ఎకరాలకు అధికంగా అందించేలా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లు, కాలువలకు మరమ్మతులు చేపట్టగా.. రహదారులు, కల్వర్టులు, వం తెనల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. కార్యక్రమా ల్లో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.