వనపర్తి, ఫిబ్రవరి 17: భూగర్భజలాల మట్టం పెరిగేందుకు ప్రతిఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సీ జీడబ్ల్యూజీ( సెంట్రల్ గ్రౌండ్ వాటర్) సైంటిస్టులు డాక్టర్ మాధవ్, విట్టలతో గురువారం భూగర్భజలాల లభ్యత, వి నియోగంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రజలు, రైతులకు నీటి పొదుపు, వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వర్షపునీటిని నిల్వ చేయటం, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా నీటిని నిల్వ చేస్తే భూగర్భజలమట్టం పెరుగుతుందని సూచించారు. భూగర్భజలాలు పెరిగితే సాగు, తాగునీటికి సమస్యలు ఉండవ ని, నీటిలభ్యత వల్ల పంటలు బాగా పండి జిల్లా సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో భూగర్భజలశాఖ అధికా రి యుగంధర్రెడ్డి, జెడ్పీసీఈవో వెంకట్రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి సురేశ్, డీపీవో సురేశ్కుమార్, డీ ఆర్డీవో నర్సింహులు, అదనపు డీఆర్డీ వో కృష్ణయ్య, ఇరిగేషన్ అధికారులు, సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ప్రభుత్వం ఉద్యానపంటల సాగును ప్రో త్సహిస్తున్నదని, రైతులకు విజ్ఞానయాత్ర ద్వారా వ్యవసాయంలో మెళకువలు, సా గుపై అవగాహన కల్పించాలని అధికారులను అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని ఆయిల్పామ్ తోటలను పరిశీలించేందుకు గురువారం వెళ్తున్న రైతుల విజ్ఞానయాత బస్సును కలెక్టరే ట్ ఆవరణలో అదనపు కలెక్టర్ జెండాఊపి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. విజ్ఞానయాత్ర ద్వారా 50మంది రైతులు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని ఆయిల్పామ్తోటలను పరిశీలించే వీలు కల్పించామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేశ్, అధికారులు కృష్ణయ్య, సురేశ్, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.