వనపర్తి: జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డు చింతల హనుమాన్ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వేగవంతం గా, నాణ్యవంతంగా నిర్మించాలని సంబంధించిన కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, స్థానిక నాయకులతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి బ్రిడ్జి పనులను పరిశీలించారు.
రోడ్ల విస్తరణలో భాగంగా నల్లచెరువును అలుగు పారే బ్రిడ్జి నాణ్యవంతంగా నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా చూసుకోవాలన్నారు. అనంతరం పాతబజార్లో నూతన డ్రైనేజీ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ముందుగా మంత్రి నిరంజన్ రెడ్డిని వార్డు ప్రజలు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు సమద్, నాగన్న, లక్ష్మినారాయణ, కృష్ణయ్య పాల్గొన్నారు.