అలంపూర్ సీహెచ్సీని పరిశీలించిన ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్, మే 21 : అలంపూర్ కమ్యూనిటీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం చెప్పా రు. శుక్రవారం అలంపూర్ సీహెచ్సీని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్యం, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తదితర వివరాలను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర సమయంలో రోగులను ఇతర వైద్యశాలలకు పంపించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విషయాన్ని ఇప్పటికే డీఎంహెచ్వో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్గౌడ్,అల్లాబకాశ్ ఉన్నారు.
టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పల్లెలతోపాటు పట్టణాలు అభివృద్ధి చెం దుతున్నాయని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, వైస్చైర్మన్ శేఖర్రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి భూమిపూజ చేశారు. 7వ వార్డు అక్బర్పేటలో రూ.60లక్షలతో సీసీరోడ్డు, 10వ వార్డు ఇమాంపురంలో పట్టణప్రగతిలో భాగంగా రూ.11లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుక్కాపురం లక్ష్మన్న, కౌన్సిలర్లు సుదర్శన్గౌడ్, షకినబీ, సుష్మారావు, ఇంతియాజ్అలీ, కోఆప్షన్ సభ్యుడు అల్లాబకాష్, టీఆర్ఎస్ నాయకులు దేవరాజ్, షేక్హుస్సేన్ వలీ, ఆలయ ధర్మకర్త వెంకట్రామయ్యశెట్టి, పెద్దారెడ్డి, పెద్ద మక్తార్, గుత్తేదారులు సత్యనారాయణరెడ్డి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.