మక్తల్ టౌన్, మే 5: సీఎం కేసీఆర్ సర్వ మతాలను ఆదరిస్తున్నారని మాజీ కౌన్సిలర్ అన్వర్ అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని కాలేజీరోడ్డులోని షరీఫా మజీద్లో రంజాన్ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కిట్లను మాజీ కౌన్సిలర్ అన్వర్, మత పెద్దలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కానుకలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మైనార్టీలకు షాదీముబారక్ ద్వారా సీఎం ప్రతి ఆడబిడ్డను ఆదరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ షాఆలం, ఇర్ఫానా అన్వర్ హుస్సేన్, మజీద్, నజీర్, అహ్మద్, మౌలానా హమీద్, నిసార్, సాధిక్, గిర్ని గౌస్, ఫజ్లుర్హ్రెమాన్, యూనుస్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ తోఫాల పంపిణీ
నారాయణపేట రూరల్, మే 5: పేట మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో బుధవారం తెలంగాణ ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాలను సర్పంచ్ సాయిరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, ఎంపీటీసీ దామోదర్రెడ్డి, ఉప సర్పంచ్ వడెప్ప ముస్లింలకు అందజేశారు. ప్రతి సంవత్సరం సీఎం కేసీఆర్ పండుగపూట ఇలాంటి కానుకలు అందిస్తుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.